దుమ్మురేపుతోన్న మన్యంపులి

- December 03, 2016 , by Maagulf
దుమ్మురేపుతోన్న మన్యంపులి

శ్రీ సరస్వతి ఫిల్మ్స్ పతాకం పై సింధూరపువ్వు కృష్ణారెడ్డి నిర్మించిన తాజా చిత్ర ‘మన్యంపులి’ ఈ శుక్రవారం విడుదలై బ్లాక్ బస్టర్ హిట్ టాక్ తో దూసుకుపోతుంది. ఈ సందర్భంగా శనివారం హైదరబాద్ ప్రసాద్ ల్యాబ్ లో మన్యంపులి యూనిట్ సభ్యులు థ్యాంక్ మీట్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నిర్మాత కృష్ణారెడ్డి మాట్లాడుతూ..
మళయాలంలో 125 కోట్లకి పైగా కలెక్షన్స్ తో భారీ విజయాన్ని సొంతం చేసుకున్న ఈ సినిమాను తెలుగు ప్రేక్షకులు కూడా అదే స్థాయిలో ఆదరించడం చాలా ఆనందంగా ఉందని తెలిపారు. కేరళ, వియత్నాం పరిసర ప్రాంతాల్లో ఈ సినిమాను దాదపు రెండేళ్లకి పైగా చిత్రీకరించారని, పులి ఉన్న సన్నివేశాల్ని దాదాపు 40 రోజులకి పైగా చిత్రీకరిచినట్లుగా నిర్మాత తెలిపారు. మోహన్ లాల్ నటన, పీటర్ హేన్స్ కంపోజ్ చేసిన యాక్షన్ సీన్స్, గోపీ సుందర్ మ్యూజిక్ ఈ సినిమాకు మెయిన్ హైలెట్స్ అని, కేవలం తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా ఓవర్ సీస్స్ లో కూడా ఈ సినిమాకు విశేషమైన ఆదరణ లభిస్తోందని సింధూరపువ్వు కృష్ణారెడ్డి చెప్పారు. పెద్దలతో పాటు చిన్నపిల్లలు కూడా అలరిస్తోన్న ఈ సినిమాలో జగపతి బాబు, కమలినీ ముఖర్జీ కీలక పాత్రల్లో నటించిన ఈ సినిమాకు వైశాఖ దర్శకత్వం వహించాడు, కథ : ఉదయ కృష్ణ, సంగీతం : గోపీ సుందర్, కెమెరా : షాజీ కుమార్, బ్యానర్ : సరస్వతి ఫిల్మ్స్

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com