దుమ్మురేపుతోన్న మన్యంపులి
- December 03, 2016
శ్రీ సరస్వతి ఫిల్మ్స్ పతాకం పై సింధూరపువ్వు కృష్ణారెడ్డి నిర్మించిన తాజా చిత్ర ‘మన్యంపులి’ ఈ శుక్రవారం విడుదలై బ్లాక్ బస్టర్ హిట్ టాక్ తో దూసుకుపోతుంది. ఈ సందర్భంగా శనివారం హైదరబాద్ ప్రసాద్ ల్యాబ్ లో మన్యంపులి యూనిట్ సభ్యులు థ్యాంక్ మీట్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నిర్మాత కృష్ణారెడ్డి మాట్లాడుతూ..
మళయాలంలో 125 కోట్లకి పైగా కలెక్షన్స్ తో భారీ విజయాన్ని సొంతం చేసుకున్న ఈ సినిమాను తెలుగు ప్రేక్షకులు కూడా అదే స్థాయిలో ఆదరించడం చాలా ఆనందంగా ఉందని తెలిపారు. కేరళ, వియత్నాం పరిసర ప్రాంతాల్లో ఈ సినిమాను దాదపు రెండేళ్లకి పైగా చిత్రీకరించారని, పులి ఉన్న సన్నివేశాల్ని దాదాపు 40 రోజులకి పైగా చిత్రీకరిచినట్లుగా నిర్మాత తెలిపారు. మోహన్ లాల్ నటన, పీటర్ హేన్స్ కంపోజ్ చేసిన యాక్షన్ సీన్స్, గోపీ సుందర్ మ్యూజిక్ ఈ సినిమాకు మెయిన్ హైలెట్స్ అని, కేవలం తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా ఓవర్ సీస్స్ లో కూడా ఈ సినిమాకు విశేషమైన ఆదరణ లభిస్తోందని సింధూరపువ్వు కృష్ణారెడ్డి చెప్పారు. పెద్దలతో పాటు చిన్నపిల్లలు కూడా అలరిస్తోన్న ఈ సినిమాలో జగపతి బాబు, కమలినీ ముఖర్జీ కీలక పాత్రల్లో నటించిన ఈ సినిమాకు వైశాఖ దర్శకత్వం వహించాడు, కథ : ఉదయ కృష్ణ, సంగీతం : గోపీ సుందర్, కెమెరా : షాజీ కుమార్, బ్యానర్ : సరస్వతి ఫిల్మ్స్
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







