'ఆన్లైన్' టాక్స్ చెల్లింపులు
- December 04, 2016
జిల్లా కేంద్రమైన మెదక్ పట్టణంలో నగదు రహిత పన్నులు వసూళ్లు చేయడమే లక్ష్యంగా బల్డియా పాలకవర్గం, అధికారులు కృషి చేస్తున్నారు. పెద్దనోట్ల రద్దుతో ఏర్పడ్డ సమస్య పరిష్కర దిశలో భాగంగా పలు ప్రయత్నాలు జరుగు తున్నాయి. గతంలో ఇంటింటికి వెళ్లి పన్నులు చెల్లించండి బాబూ అంటూ గిరికీలు కొట్టే సిబ్బందికి కొంత ఊరట లభించింది. కలెక్టర్ భారతి హోళికేరి రైతులకు సంబంధించిన లావాదేవీలను స్వైప్మిషన్ల ద్వారా అలవాటు చేయాలని ఇప్పటికే పేర్కొన్నారు. ఈ మేరకు మున్సిపాలిటీలకు కూడా పన్ను వసూళ్లు చేసేందుకు నేటి నుంచి స్వైప్ మిషన్లను వాడుతున్నట్లు చెప్పారు. ప్రస్తుతం ఉన్న స్వైప్ మిషన్లతో వ్యాపార, వాణిజ్య, దుకాణాల కిరాయిలను వసూళ్లు చేసేందుకు నిర్ణయించినట్లు తెలిపారు.పట్టణం మొత్తం ఈ విధానాన్ని అనుసరించేందుకు మరో 10 స్వైప్ మిషన్లు కావాలని ఎస్బీహెచ్ అధికారులను కోరినట్లు వివరించారు.
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







