'ఆన్‌లైన్‌' టాక్స్‌ చెల్లింపులు

- December 04, 2016 , by Maagulf
'ఆన్‌లైన్‌' టాక్స్‌ చెల్లింపులు

జిల్లా కేంద్రమైన మెదక్‌ పట్టణంలో నగదు రహిత పన్నులు వసూళ్లు చేయడమే లక్ష్యంగా బల్డియా పాలకవర్గం, అధికారులు కృషి చేస్తున్నారు. పెద్దనోట్ల రద్దుతో ఏర్పడ్డ సమస్య పరిష్కర దిశలో భాగంగా పలు ప్రయత్నాలు జరుగు తున్నాయి. గతంలో ఇంటింటికి వెళ్లి పన్నులు చెల్లించండి బాబూ అంటూ గిరికీలు కొట్టే సిబ్బందికి కొంత ఊరట లభించింది. కలెక్టర్‌ భారతి హోళికేరి రైతులకు సంబంధించిన లావాదేవీలను స్వైప్‌మిషన్ల ద్వారా అలవాటు చేయాలని ఇప్పటికే పేర్కొన్నారు. ఈ మేరకు మున్సిపాలిటీలకు కూడా పన్ను వసూళ్లు చేసేందుకు నేటి నుంచి స్వైప్‌ మిషన్లను వాడుతున్నట్లు చెప్పారు. ప్రస్తుతం ఉన్న స్వైప్‌ మిషన్లతో వ్యాపార, వాణిజ్య, దుకాణాల కిరాయిలను వసూళ్లు చేసేందుకు నిర్ణయించినట్లు తెలిపారు.పట్టణం మొత్తం ఈ విధానాన్ని అనుసరించేందుకు మరో 10 స్వైప్‌ మిషన్లు కావాలని ఎస్‌బీహెచ్‌ అధికారులను కోరినట్లు వివరించారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com