గోవాలో యువతకు కొత్త పథకం
- December 04, 2016
కేంద్ర ప్రభుత్వ పిలుపు మేరకు డిజిటల్ ఇండియాను ఆవిష్కృతం చేసేందుకు గోవా రాష్ట్రం ముందడుగు వేస్తోంది. ఉచిత ఇంటర్నెట్ డేటా, టాక్టైంను రేపటి నుంచి గోవాలోని యువతకు అందించనుంది. 'గోవా యువ సంచార్ యోజన' పథకాన్ని సోమవారం ప్రవేశపెట్టనున్నారు. ఈ పథకం కింద 16-30 ఏళ్ల వయస్సు ఉన్న వారందరికీ కొత్త సిమ్ పంపిణీ చేసి దాని ద్వారా 100 నిమిషాల టాక్టైం, 3జీబీ ఇంటర్నెట్ డేటాను ఉచితంగా అందించనున్నట్లు రాష్ట్ర ముఖ్యమంత్రి లక్ష్మీకాంత్ పర్సేకర్ వెల్లడించారు. ఈ మేరకు వొడాఫోన్తో ఒప్పందం చేసుకున్నట్లు చెప్పారు.
ఈ పథకం ద్వారా దాదాపు 1.25లక్షల మందికి లబ్ధి చేకూరనుంది. ఈ పథకానికి నవంబర్ 25వ తేదీన గోవా రాష్ట్ర క్యాబినెట్ ఆమోదం తెలిపినట్లు పర్సేకర్ తెలిపారు. డిజిటల్ ఇండియా కార్యక్రమంలో అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు భాగస్వాములు కావాలని కేంద్రం ఇచ్చిన పిలుపు మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన వెల్లడించారు.
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







