గోవాలో యువతకు కొత్త పథకం

- December 04, 2016 , by Maagulf
గోవాలో యువతకు కొత్త పథకం

కేంద్ర ప్రభుత్వ పిలుపు మేరకు డిజిటల్‌ ఇండియాను ఆవిష్కృతం చేసేందుకు గోవా రాష్ట్రం ముందడుగు వేస్తోంది. ఉచిత ఇంటర్నెట్‌ డేటా, టాక్‌టైంను రేపటి నుంచి గోవాలోని యువతకు అందించనుంది. 'గోవా యువ సంచార్‌ యోజన' పథకాన్ని సోమవారం ప్రవేశపెట్టనున్నారు. ఈ పథకం కింద 16-30 ఏళ్ల వయస్సు ఉన్న వారందరికీ కొత్త సిమ్‌ పంపిణీ చేసి దాని ద్వారా 100 నిమిషాల టాక్‌టైం, 3జీబీ ఇంటర్నెట్‌ డేటాను ఉచితంగా అందించనున్నట్లు రాష్ట్ర ముఖ్యమంత్రి లక్ష్మీకాంత్‌ పర్సేకర్‌ వెల్లడించారు. ఈ మేరకు వొడాఫోన్‌తో ఒప్పందం చేసుకున్నట్లు చెప్పారు.

ఈ పథకం ద్వారా దాదాపు 1.25లక్షల మందికి లబ్ధి చేకూరనుంది. ఈ పథకానికి నవంబర్‌ 25వ తేదీన గోవా రాష్ట్ర క్యాబినెట్‌ ఆమోదం తెలిపినట్లు పర్సేకర్‌ తెలిపారు. డిజిటల్‌ ఇండియా కార్యక్రమంలో అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు భాగస్వాములు కావాలని కేంద్రం ఇచ్చిన పిలుపు మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన వెల్లడించారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com