హోటల్లో భారీ అగ్నిప్రమాదం, 11 మంది సజీవదహనం
- December 04, 2016
పాకిస్థాన్లోని కరాచీ నగరంలో సోమవారం ఉదయం భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. కరాచీలోని రెజెంట్ ప్లాజా హోటల్లో ఉదయం భారీస్థాయిలో మంటలు చెలరేగడంతో 11 మంది సజీవదహనమయ్యారు. గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్న వంటగదిలో చెలరేగిన మంటలు కొద్దిసేపట్లోనే ఆరో అంతస్థు వరకు వేగంగా వ్యాపించాయి. మూడు అగ్నిమాపక శకటాలు ఘటనాస్థలికి చేరుకుని మూడు గంటల పాటు శ్రమించి మంటలు అదుపుచేశారు. ఈ ప్రమాదంలో 70 మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు.
వీరిని చికిత్స నిమిత్తం స్థానిక ఆస్పత్రులకు తరలించారు. హోటల్లో బస చేస్తున్న కొందరు తప్పించుకునేందుకు హోటల్ భవనంపై నుంచి దూకేశారు. దీంతో కొందరికి ఎముకలు విరగగా మరికొందరికి గాజు పెంకులు శరీరంలోకి చొచ్చుకుపోయాయి. మృతుల్లో ఎక్కువమంది వూపిరాడక ప్రాణాలు వదిలినట్లు అధికారులు వెల్లడించారు. వీరిలో ఇద్దరు వైద్యులుకూడా ఉన్నట్లు పేర్కొన్నారు. హోటల్లో చిక్కుకున్న మరికొందరిని రక్షించేందుకు సహాయక బృందం చర్యలు చేపడుతోంది.
తాజా వార్తలు
- జలీబ్లో ఉక్కుపాదం.. 1,253 మంది అరెస్ట్..!!
- ఒమాన్లో ఆగస్టు 1 నుంచి అమల్లోకి వచ్చిన కీలక మార్పులు..!!
- అమెరికాలో సౌదీ రక్షణ శాఖ సహాయ మంత్రి..కీలక చర్చలు..!!
- ఘనంగా ప్రారంభమైన సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి బోనాలు..
- నిబంధనల ఉల్లంఘన.. ట్రావెల్ ఏజెన్సీ మూసివేత..!!
- యూఏఈలో ఈ ఏడాది తొలిసారి 50°C నమోదు..!!
- ఆరు రోజుల్లోనే 38 వేల మంది సందర్శకులు..విశేష ఆదరణ..!!
- వాట్సాప్ అంకుల్స్ పై ఇన్స్టా పిల్లలు గెలిచారు: కేటీఆర్
- తెలంగాణలో ‘ఆపరేషన్ ముస్కాన్’..
- అమర్నాథ్ భక్తులకు గుడ్ న్యూస్..







