తీవ్ర రూపం దాల్చిన 'వార్దా'

- December 08, 2016 , by Maagulf
తీవ్ర రూపం దాల్చిన 'వార్దా'

ఆగ్నేయ బంగాళా ఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం తుపానుగా మారింది. ఆంధ్రప్రదేశ్‌ వైపు దూసుకు వస్తోన్న ఈ తుపానుకు 'వార్దా' పేరు పెట్టారు. విశాఖకు ఆగ్నేయంగా 1040 కిలోమీటర్ల దూరంలో, మచిలీపట్నానికి తూర్పు ఆగ్నేయ దిశలో 1135 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమైనట్టు వాతావరణ శాఖ వెల్లడించింది.

ఈ నెల 12న నెల్లూరు-కాకినాడ మధ్య తుపాను తీరం దాటే అవకాశముంది. మధ్యాహ్నం లేదా సాయంత్రం సమయంలో తుపాను తీరం దాటనుంది. తీరం దాటే ముందే తుపాను బలహీనపడనుంది. తుపాను ప్రభావంతో 11 నుంచి కోస్తా వర్షాలు కురుస్తాయని, బలంగా గాలులు వీస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com