నాగ్, అమితాబ్ ముఖ్య అతిథులుగా వంగవీటి వేడుకకు
- December 09, 2016
వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తన లేటెస్ట్ సినిమా వంగవీటి విషయంలో పట్టు వీడటం లేదు. విజయవాడ హత్యారాజకీయాల నేపథ్యంలో వర్మ తెరకెక్కించిన వంగవీటి సినిమాను ఎన్ని అడ్డంకులు ఎదురైనా రిలీజ్ చేస్తానంటూ చెపుతున్నాడు. ఇప్పటికే సినిమాలో ప్రధాన పాత్రలైన వంగవీటి, దేవినేని కుంటుంబాలను కలిసిన వర్మ, విజయవాడ వేదికగా ఆడియో వేడుకను ఘనం నిర్వహించాడు. అయితే అదే సమయంలో కొంత మంది పెద్ద మనుషుల నుంచి సినిమా విడుదలకు ఇబ్బందులు కలిగిస్తున్నారని విమర్శలు చేశాడు.ఈ నెల 23న రిలీజ్ కు రెడీ అవుతున్న వంగవీటి సినిమాకు సంబంధించి ఓ భారీ ప్రీ రిలీజ్ ఫంక్షన్ ను ప్లాన్ చేస్తున్నాడు వర్మ. డిసెంబర్ 20న హైదరాబాద్ వేదికగా ఈ వేడుకకు ఏర్పాట్లు చేస్తున్నాడు.అంతేకాదు ఈ వేడుకలో టాలీవుడ్ స్టార్ హీరో నాగార్జునతో పాటు బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ లు ముఖ్య అతిథులుగా పాల్గొంటారని ఎనౌన్స్ మెంట్ కూడా ఇచ్చేశాడు. ఇంత వివాదాస్పదమైన సినిమా ఫంక్షన్ లో ఈ స్టార్ హీరోలు పాల్గొంటారా..? ఒకవేళ పాల్గొన్నా సినిమాకు సంబంధించి ఏం మాట్లాడతారు..? అన్నది ఇప్పుడు ఫిలిం సర్కిల్స్ లో ఆసక్తికరంగా మారింది.
తాజా వార్తలు
- డబ్బులు తీసుకుని వీసాలు ఇప్పిస్తామంటూ మోసాలు.. అప్రమత్తంగా ఉండాలని దుబాయ్ పోలీసుల హెచ్చరిక
- ఇరాన్ దాడులతో కువైట్లో చెలరేగిన మంటలు అదుపులోకి.. పలువురికి గాయాలు
- 72 వ జాతీయ చలనచిత్ర పురస్కారాలు ప్రకటింపు..
- FICCI FLO ప్రధాన కార్యాలయానికి వెయ్యి గజాల స్థలం కేటాయింపు: సీఎం రేవంత్
- అమెరికా పై ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ తీవ్ర విమర్శలు..
- కువైట్, బహ్రెయిన్, జోర్డాన్లపై ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన GCC
- హైదరాబాద్లో ‘ఆండ్ పర్పస్ ఫోరమ్ 2026’ సదస్సు
- దుబాయ్ పేలుళ్లపై తప్పుడు కథనం ప్రచురణ.. జర్నలిస్టు, బృందానికి యూఏఈ సమన్లు
- ప్రజాకవి అందె సీఎం రేవంత్ ఘన నివాళులు..
- బ్రెయిన్ ఇంజ్యూరీ నుంచి జాతీయ సేవలోకి..ఓ టీన్ స్ఫూర్తి ప్రయాణం..!!







