పంజాబ్లో ఘోర రోడ్డు ప్రమాదం ....13మంది ఉపాధ్యాయులు మృతి
- December 09, 2016
పంజాబ్లో శుక్రవారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. 15మందితో వెళ్తున్న జీపు.. ట్రక్కును ఢీకొన్న ఘటనలో 13 మంది అక్కడికక్కడే మృతిచెందారు. ఈ ఘటన ఫజిల్కా జిల్లా కేంద్రానికి 9 కిలోమీటర్ల దూరంలోని చందీపూర్ వద్ద చోటుచేసుకుంది. మృతులంతా ప్రభుత్వ ఉపాధ్యాయులే. వీరిలో ఐదుగురు మహిళలున్నారు.ఉదయం విధులకు హాజరయ్యేందుకు వీరంతా జీపులో బయలుదేరారు. దట్టమైన పొగమంచు కారణంగా రోడ్డు సరిగా కనిపించకపోవడంతో వీరు ప్రయాణిస్తున్న వాహనం లారీని ఢీకొన్నట్లు ప్రత్యక్షసాక్షి తెలిపారు.ప్రమాద సమయం నుంచి ఇద్దరు ప్రాణాలతో బయటపడగా..వీరిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. మృతదేహాలను జిల్లా కేంద్ర ఆస్పత్రికి తరలించారు. ప్రభుత్వ అధికారులు, స్థానిక నేతలు సంఘటనా స్థలికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. ఉపాధ్యాయులు మృతికి సంతాపంగా స్థానికులు స్వచ్ఛంద బంద్కు పిలపునిచ్చారు.
తాజా వార్తలు
- డబ్బులు తీసుకుని వీసాలు ఇప్పిస్తామంటూ మోసాలు.. అప్రమత్తంగా ఉండాలని దుబాయ్ పోలీసుల హెచ్చరిక
- ఇరాన్ దాడులతో కువైట్లో చెలరేగిన మంటలు అదుపులోకి.. పలువురికి గాయాలు
- 72 వ జాతీయ చలనచిత్ర పురస్కారాలు ప్రకటింపు..
- FICCI FLO ప్రధాన కార్యాలయానికి వెయ్యి గజాల స్థలం కేటాయింపు: సీఎం రేవంత్
- అమెరికా పై ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ తీవ్ర విమర్శలు..
- కువైట్, బహ్రెయిన్, జోర్డాన్లపై ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన GCC
- హైదరాబాద్లో ‘ఆండ్ పర్పస్ ఫోరమ్ 2026’ సదస్సు
- దుబాయ్ పేలుళ్లపై తప్పుడు కథనం ప్రచురణ.. జర్నలిస్టు, బృందానికి యూఏఈ సమన్లు
- ప్రజాకవి అందె సీఎం రేవంత్ ఘన నివాళులు..
- బ్రెయిన్ ఇంజ్యూరీ నుంచి జాతీయ సేవలోకి..ఓ టీన్ స్ఫూర్తి ప్రయాణం..!!







