పంజాబ్లో ఘోర రోడ్డు ప్రమాదం ....13మంది ఉపాధ్యాయులు మృతి
- December 09, 2016
పంజాబ్లో శుక్రవారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. 15మందితో వెళ్తున్న జీపు.. ట్రక్కును ఢీకొన్న ఘటనలో 13 మంది అక్కడికక్కడే మృతిచెందారు. ఈ ఘటన ఫజిల్కా జిల్లా కేంద్రానికి 9 కిలోమీటర్ల దూరంలోని చందీపూర్ వద్ద చోటుచేసుకుంది. మృతులంతా ప్రభుత్వ ఉపాధ్యాయులే. వీరిలో ఐదుగురు మహిళలున్నారు.ఉదయం విధులకు హాజరయ్యేందుకు వీరంతా జీపులో బయలుదేరారు. దట్టమైన పొగమంచు కారణంగా రోడ్డు సరిగా కనిపించకపోవడంతో వీరు ప్రయాణిస్తున్న వాహనం లారీని ఢీకొన్నట్లు ప్రత్యక్షసాక్షి తెలిపారు.ప్రమాద సమయం నుంచి ఇద్దరు ప్రాణాలతో బయటపడగా..వీరిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. మృతదేహాలను జిల్లా కేంద్ర ఆస్పత్రికి తరలించారు. ప్రభుత్వ అధికారులు, స్థానిక నేతలు సంఘటనా స్థలికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. ఉపాధ్యాయులు మృతికి సంతాపంగా స్థానికులు స్వచ్ఛంద బంద్కు పిలపునిచ్చారు.
తాజా వార్తలు
- వాటర్ బిల్లు పేరుతో ఏపీకే ఫైల్స్..సీపీ సజ్జనార్ కీలక సూచనలు
- చమురుయేతర రంగాలలో GCC ఎకానమీ దూకుడు..!!
- ప్రపంచ వృద్ధి అంచనాలను తగ్గించనున్న ఐఎంఎఫ్..!!
- ఇండియన్ ఓషన్ కాన్ఫరెన్స్ లో పాల్గొన్న ఒమన్ విదేశాంగ మంత్రి..!!
- Dh4 ట్రాఫిక్ ఫైన్? ఫేక్ SMS స్కామ్ బస్ట్..!!
- BD800 మిలియన్లతో 50వేల హౌజింగ్ యూనిట్లు..!!
- సంక్షోభాన్ని ఐక్యతతో అధిగమించిన యూఏఈ
- ఇస్లామాబాద్ వేదికగా అమెరికా-ఇరాన్ శాంతి చర్చలు: ఉత్కంఠలో ప్రపంచం!
- శ్రీలంక లో పర్యటించిన FTPC ఇండియా బృందం
- సింగర్ మంగ్లీ పై కేసు నమోదు..









