పంజాబ్లో ఘోర రోడ్డు ప్రమాదం ....13మంది ఉపాధ్యాయులు మృతి
- December 09, 2016
పంజాబ్లో శుక్రవారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. 15మందితో వెళ్తున్న జీపు.. ట్రక్కును ఢీకొన్న ఘటనలో 13 మంది అక్కడికక్కడే మృతిచెందారు. ఈ ఘటన ఫజిల్కా జిల్లా కేంద్రానికి 9 కిలోమీటర్ల దూరంలోని చందీపూర్ వద్ద చోటుచేసుకుంది. మృతులంతా ప్రభుత్వ ఉపాధ్యాయులే. వీరిలో ఐదుగురు మహిళలున్నారు.ఉదయం విధులకు హాజరయ్యేందుకు వీరంతా జీపులో బయలుదేరారు. దట్టమైన పొగమంచు కారణంగా రోడ్డు సరిగా కనిపించకపోవడంతో వీరు ప్రయాణిస్తున్న వాహనం లారీని ఢీకొన్నట్లు ప్రత్యక్షసాక్షి తెలిపారు.ప్రమాద సమయం నుంచి ఇద్దరు ప్రాణాలతో బయటపడగా..వీరిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. మృతదేహాలను జిల్లా కేంద్ర ఆస్పత్రికి తరలించారు. ప్రభుత్వ అధికారులు, స్థానిక నేతలు సంఘటనా స్థలికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. ఉపాధ్యాయులు మృతికి సంతాపంగా స్థానికులు స్వచ్ఛంద బంద్కు పిలపునిచ్చారు.
తాజా వార్తలు
- 'ఎయిర్ వైస్ మార్షల్' ర్యాంక్ సాధించిన తొలి మహిళా ఆఫీసర్గా శక్తి శర్మ
- ఏసీ బస్సుల్లోనూ మహిళలకు ఫ్రీ: సీఎం చంద్రబాబు
- బిట్స్ పిలానీ హైదరాబాద్ క్యాంపస్ యూఏవీ ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్లో చోటు
- సౌదీ అరేబియాలో ఒమన్ సుల్తాన్ పర్యటన..
- హైదరాబాద్-విజయవాడ-మచిలీపట్నం NH-65 విస్తరణకు ఆమోదం
- కాశీలో ఘనంగా బోనాల పండుగ వేడుకలు
- గణేష్ ఉత్సవాల ఏర్పాట్ల పై తెలంగాణ ప్రభుత్వ సమావేశంలో పాల్గొన్న డీజీపీ సీవీ ఆనంద్
- విపత్తు బాధితుల పాలిట ప్రాణదాతగా కెప్టెన్ ప్రియ
- భారత మార్కెట్పై అజ్మాన్ దృష్టి.. కొత్త ట్రేడ్ ఇన్సెంటివ్ ప్రోగ్రామ్ ప్రకటన
- స్థానిక ఎన్నికల పై సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు







