సావిత్రి పాత్ర పోషించనున్న సమంత
- December 10, 2016
అలనాటి నటి సావిత్రి జీవితం ఆధారంగా 'ఎవడే సుబ్రమణ్యం' ఫేం నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ఓ చిత్రం తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో కథానాయికగా అనేక పేర్లు వినిపించాయి. తొలుత విద్యాబాలన్, ఆ తర్వాత నిత్యా మేనన్ అని పుకార్లు వచ్చాయి. అయితే తాజాగా అందిన సమాచారం ప్రకారం ఇందులో సమంతను కథానాయికగా అనుకుంటున్నట్లు చిత్ర వర్గాల టాక్. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. తెలుగు, తమిళ భాషల్లో ఈ చిత్రాన్ని తెరకెక్కించనున్నారు. దర్శకుడు ఇప్పటికే పూర్తి స్క్రిప్టుతో సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఇటీవల సమంత తన తర్వాతి తెలుగు చిత్రాల గురించి త్వరలో ప్రకటిస్తానని ట్వీట్ చేసిన సంగతి తెలిసిందే.
తాజా వార్తలు
- ఇరాన్తో మునుపటి సంబంధాలు అసాధ్యం..!!
- డిఫెన్స్ ఫోర్స్ సన్నద్ధతను సమీక్షించిన కింగ్ హమద్ ..!!
- 1200 ఫ్లైట్స్ నడుపుతున్న జజీరా ఎయిర్వేస్..!!
- సౌదీ అరేబియాలో 1.6% తగ్గిన ప్రాపర్టీ ధరలు..!!
- బర్కాలో ఆసియా దేశస్థుడు అరెస్టు..!!
- ఖతార్కు విదేశీ విమానయాన సంస్థల సేవలు పునరుద్ధరణ..!!
- IPL 2026: గుజరాత్ పై ముంబై ఘన విజయం
- నటుడు జగపతిబాబు చేతుల మీదగా రామ్ కొణికి సరికొత్త 'కొణికి లక్స్' స్కిన్ కేర్ ప్రారంభం
- మే 1 నుంచి తిరుమలలో శ్రీవారి దర్శనానికి కొత్త నిబంధనలు
- JEE మెయిన్స్ తుది ఫలితాలు వచ్చేశాయ్..









