సావిత్రి పాత్ర పోషించనున్న సమంత

- December 10, 2016 , by Maagulf
సావిత్రి పాత్ర పోషించనున్న సమంత

అలనాటి నటి సావిత్రి జీవితం ఆధారంగా 'ఎవడే సుబ్రమణ్యం' ఫేం నాగ్‌ అశ్విన్‌ దర్శకత్వంలో ఓ చిత్రం తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో కథానాయికగా అనేక పేర్లు వినిపించాయి. తొలుత విద్యాబాలన్‌, ఆ తర్వాత నిత్యా మేనన్‌ అని పుకార్లు వచ్చాయి. అయితే తాజాగా అందిన సమాచారం ప్రకారం ఇందులో సమంతను కథానాయికగా అనుకుంటున్నట్లు చిత్ర వర్గాల టాక్‌. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. తెలుగు, తమిళ భాషల్లో ఈ చిత్రాన్ని తెరకెక్కించనున్నారు. దర్శకుడు ఇప్పటికే పూర్తి స్క్రిప్టుతో సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఇటీవల సమంత తన తర్వాతి తెలుగు చిత్రాల గురించి త్వరలో ప్రకటిస్తానని ట్వీట్‌ చేసిన సంగతి తెలిసిందే.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com