సావిత్రి పాత్ర పోషించనున్న సమంత
- December 10, 2016
అలనాటి నటి సావిత్రి జీవితం ఆధారంగా 'ఎవడే సుబ్రమణ్యం' ఫేం నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ఓ చిత్రం తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో కథానాయికగా అనేక పేర్లు వినిపించాయి. తొలుత విద్యాబాలన్, ఆ తర్వాత నిత్యా మేనన్ అని పుకార్లు వచ్చాయి. అయితే తాజాగా అందిన సమాచారం ప్రకారం ఇందులో సమంతను కథానాయికగా అనుకుంటున్నట్లు చిత్ర వర్గాల టాక్. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. తెలుగు, తమిళ భాషల్లో ఈ చిత్రాన్ని తెరకెక్కించనున్నారు. దర్శకుడు ఇప్పటికే పూర్తి స్క్రిప్టుతో సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఇటీవల సమంత తన తర్వాతి తెలుగు చిత్రాల గురించి త్వరలో ప్రకటిస్తానని ట్వీట్ చేసిన సంగతి తెలిసిందే.
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







