ఖతార్‌లో ఎగ్జిట్‌ పర్మిట్‌ గ్రీవెన్సెస్‌ కమిటీ

- December 11, 2016 , by Maagulf
ఖతార్‌లో ఎగ్జిట్‌ పర్మిట్‌ గ్రీవెన్సెస్‌ కమిటీ

దోహా: మినిస్ట్రీ ఆఫ్‌ ఇంటీరియర్‌, వలసదారుల ఎగ్జిట్‌ పర్మిట్స్‌కి సంబంధించిన గ్రీవెన్సెస్‌ని పరిశీలించేందుకు ఓ కమిటీని ఏర్పాటు చేయనుంది. ప్రెస్‌ కాన్ఫరెన్స్‌లో మినిస్ట్రీ అధికారులు కొత్త కమిటీని 'ఎగ్జిట్‌ పర్మిట్‌ గ్రీవెన్సెస్‌ కమిటీ' పేరుతో ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు. యజమాని, వలసదారులకు దేశం విడిచి వెళ్ళేందుకు అనుమతించని పక్షంలో ఈ గ్రీవెన్స్‌ కమిటీ, ఆ సమస్యను పరిష్కరించేందుకు చర్యలు చేపడుతుంది. డిసెంబర్‌ 13 నుంచి ఈ కమిటీ పని చేయడం ప్రారంభిస్తుంది. నార్త్‌ మదీనా ఖలీఫ్‌ - ఓల్డ్‌ ట్రాఫిక్‌ ఆఫీస్‌లో ఈ కమిటీ కార్యకలాపాలు కొనసాగిస్తుంది. ఫిర్యాదు అందిన మూడు రోజుల్లోపు కమిటీ తన నిర్ణయాన్ని ప్రకటించేలా కమిటీకి విధి విధానాల్ని మినిస్ట్రీ అందించింది. ఒకవేళ వలసదారుడి రిక్వెస్ట్‌ గనుక తిప్పి పంపబడినట్లయితే 24 గంటల్లోగా మినిస్ట్రీకి ఫిర్యాదు చేయవచ్చు. ప్రస్తుతం మ్యాన్యువల్‌గా ఫామ్‌ నింపేలా ఏర్పాట్లు చేశారు. ఆ తర్వాత దీన్ని ఎలక్ట్రానిక్‌ సిస్టమ్‌లోకి మార్చుతారు. కమిటీ ఛైర్మన్‌గా మినిస్ట్రీ ఆఫ్‌ ఇంటీరియర్‌ - డైరెక్టర్‌ ఆఫ్‌ లీగల్‌ ఎఫైర్స్‌బ్రిగేడియర్‌ సలెం అల్‌ మెరైకి ఉంటారు. మినిస్ట్రీ ఆఫ్‌ ఇంటీరియర్‌, మినిస్ట్రీ ఆఫ్‌ అడ్మినిస్ట్రేటివ్‌ డెవలప్‌మెంట్‌ లేబర్‌ అండ్‌ సోషల్‌ ఎఫైర్స్‌, ఖతార్‌ నేషనల్‌ హ్యూమన్‌ రైట్స్‌ కమిటీ సభ్యులు ఈ కమిటీలో ఉంటారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com