రేపు ట్రంప్‌తో భేటీకానున్న ఐటీ కంపెనీల సీఈఓలు

- December 13, 2016 , by Maagulf
రేపు ట్రంప్‌తో భేటీకానున్న ఐటీ కంపెనీల సీఈఓలు

త్వరలో అమెరికా అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించబోతున్న డొనాల్డ్ ట్రంప్‌తో మైక్రోసాప్ట్ సీఈఓ సత్య నాదెళ్ళ పలు ఐటీ కంపెనీల సీఈఓలు భేటీ కానున్నారు.  యాపిల్, అల్ఫాబెట్, పేస్‌బుక్, ఇంటెల్, అమెజాన్.కామ్, ఒరాకిల్, ఐబీఎం కంపెనీల సీఈఓలకు ఆహ్వానాలు వెళ్ళాయి.  వలసలు, హెచ్-1బీ వీసాలనై కొంత మంది సీఈఓలు విమర్శలు చేయడంతో ట్రంప్ వారిని ఈ సమావేశానికి ఆహ్వానించలేదు.  రేపు జరిగే సమావేశంలో టెక్నాలజీ కంపెనీల సీఈఓలు ఈ అంశాలపై ట్రంప్‌కు తమ వైఖరిని స్పష్టం చేస్తారని భావిస్తున్నారు.  ముఖ్యంగా హెచ్-1 బీ వీసాలపై ఆంక్షలు విధిస్తే టెక్నాలజీ పరిశ్రమకు చాలినంత మంది ఉద్యోగులు లభించకపోవచ్చని ఈ కంపెనీలు భావిస్తున్నాయి. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com