సతీ సమేతంగా భారత్ లో పర్యటించిన ఇండోనేషియా అధ్యక్షుడు
- December 13, 2016
ఇండోనేషియా అధ్యక్షుడు జోకో విడోడో సతీ సమేతంగా భారత్లో పర్యటించారు. రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీతో భేటీ అయిన ప్రధాని మోడీతో కలిసి ద్వైపాక్షిక చర్చలు జరిపారు. రెండు దేశాల మధ్య మూడు కీలక ఒప్పందాలపై సంతకాలు చేశారు. రెండు రోజుల పర్యటన కోసం భారత్ వచ్చిన ఇండోనేషియా అధ్యక్షుడు జోకో విడోడోకు ఘన స్వాగతం లభించింది. భార్యతో కలిసి వచ్చిన విడోడోకు రాష్ట్రపతి భవన్ దగ్గర ప్రధాని మోడీ ఎదురెళ్లి ఆహ్వానించారు. అనంతరం విడోడో రాష్ట్రపతిని కలిశారు. 2014లో అధ్యక్షుడుగా ఎన్నికైన విడోడో భారత్కు రావడం ఇదే మొదటి సారి. విడోడోతోపాటూ సీనియర్ అధికారులు, 22 మంది వ్యాపారవేత్తలు భారత్ వచ్చారు. రాజ్ ఘాట్ దగ్గర మహాత్ముడి సమాధికి నివాళి అర్పించారు. అనంతరం ప్రధాని మోడీతో ద్వైపాక్షిక చర్చల్లో పాల్గొన్న విడోడో.. పలు కీలక అంశాలపై ఆయనతో చర్చించారు. ఇండోనేషియా అధ్యక్షుడితో కలిసి ప్రధాని మోడీ సంయుక్త మీడియా సమావేశంలో పాల్గొన్నారు. ఇండోనేషియా భారత్కు మిత్ర దేశమన్నారు.
భారత్ ఇండోనేషియా మధ్య మూడు కీలక ఒప్పందాలు కుదిరాయి. ఈ ఒప్పందాలపై రెండు దేశాల మంత్రులు సంతకాలు చేశారు. ఈ సందర్భంగా ఇండోనేషియా భారత్కు ముఖ్యమైన వాణిజ్య భాగస్వామిగా పేర్కొన్నారు మోడీ. భారత్-ఇండోనేషియాలు అభివృద్ధిలో పరస్పరం సహకరించుకోవాలని ఆకాంక్షించారు.
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







