సతీ సమేతంగా భారత్ లో పర్యటించిన ఇండోనేషియా అధ్యక్షుడు
- December 13, 2016
ఇండోనేషియా అధ్యక్షుడు జోకో విడోడో సతీ సమేతంగా భారత్లో పర్యటించారు. రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీతో భేటీ అయిన ప్రధాని మోడీతో కలిసి ద్వైపాక్షిక చర్చలు జరిపారు. రెండు దేశాల మధ్య మూడు కీలక ఒప్పందాలపై సంతకాలు చేశారు. రెండు రోజుల పర్యటన కోసం భారత్ వచ్చిన ఇండోనేషియా అధ్యక్షుడు జోకో విడోడోకు ఘన స్వాగతం లభించింది. భార్యతో కలిసి వచ్చిన విడోడోకు రాష్ట్రపతి భవన్ దగ్గర ప్రధాని మోడీ ఎదురెళ్లి ఆహ్వానించారు. అనంతరం విడోడో రాష్ట్రపతిని కలిశారు. 2014లో అధ్యక్షుడుగా ఎన్నికైన విడోడో భారత్కు రావడం ఇదే మొదటి సారి. విడోడోతోపాటూ సీనియర్ అధికారులు, 22 మంది వ్యాపారవేత్తలు భారత్ వచ్చారు. రాజ్ ఘాట్ దగ్గర మహాత్ముడి సమాధికి నివాళి అర్పించారు. అనంతరం ప్రధాని మోడీతో ద్వైపాక్షిక చర్చల్లో పాల్గొన్న విడోడో.. పలు కీలక అంశాలపై ఆయనతో చర్చించారు. ఇండోనేషియా అధ్యక్షుడితో కలిసి ప్రధాని మోడీ సంయుక్త మీడియా సమావేశంలో పాల్గొన్నారు. ఇండోనేషియా భారత్కు మిత్ర దేశమన్నారు.
భారత్ ఇండోనేషియా మధ్య మూడు కీలక ఒప్పందాలు కుదిరాయి. ఈ ఒప్పందాలపై రెండు దేశాల మంత్రులు సంతకాలు చేశారు. ఈ సందర్భంగా ఇండోనేషియా భారత్కు ముఖ్యమైన వాణిజ్య భాగస్వామిగా పేర్కొన్నారు మోడీ. భారత్-ఇండోనేషియాలు అభివృద్ధిలో పరస్పరం సహకరించుకోవాలని ఆకాంక్షించారు.
తాజా వార్తలు
- IPL 2026: గుజరాత్ పై ముంబై ఘన విజయం
- నటుడు జగపతిబాబు చేతుల మీదగా రామ్ కొణికి సరికొత్త 'కొణికి లక్స్' స్కిన్ కేర్ ప్రారంభం
- మే 1 నుంచి తిరుమలలో శ్రీవారి దర్శనానికి కొత్త నిబంధనలు
- JEE మెయిన్స్ తుది ఫలితాలు వచ్చేశాయ్..
- ఏపీకి కేంద్ర ప్రభుత్వం గొప్ప శుభవార్త
- కాంగ్రెస్ ప్రభుత్వంకు కేసీఆర్ డెడ్లైన్
- కరీంనగర్లో ఘనంగా 'కార్తికేయ జువెలరీస్' ప్రారంభోత్సవం
- యూఏఈలో ఉగ్రవాద సంస్థ భగ్నం: దేశ భద్రతను దెబ్బతీయాలన్న కుట్ర విఫలం
- బహ్లా కోటలో నాలుగు కొత్త మ్యూజియమ్స్ ప్రారంభం..!!
- ఖతార్ మున్సిపాలిటీలో ఈకో ఫ్రెండ్లీ వెహికల్స్, పరికరాలు..!!









