టాలీవుడ్ లో కొత్త ప్రాజెక్ట్ లతో బిజీ గా ఉన్న అరవింద్ స్వామి

- December 13, 2016 , by Maagulf
టాలీవుడ్ లో కొత్త ప్రాజెక్ట్ లతో  బిజీ గా ఉన్న అరవింద్ స్వామి

దళపతి సినిమాలో చిన్న పాత్రలో వెండి తెరపై మెరుపులా మెరిశాడు.. ఇక రోజా సినిమాతో మంచి పాపులర్ అయ్యాడు... ముంబై సినిమాతో స్టార్ హీరో సమానంగా స్టార్ డమ్ తెచ్చుకున్న అరవింద్ అమ్మాయిల కలల హీరోగా మారాడు... కానీ అవకాశాలు లేక వెనుకబడిపోయాడు.. దీంతో అరవింద్ తన పంథా మార్చుకొని తనిఒరువన్ లో విలన్ గా నటించాడు.. ఆ సినిమా సూపర్ హిట్ కావడమే కాదు... హీరో కంటే కూడా మంచి పేరు సంపాదించుకున్నాడు.. కాగా తనిఒరువన్ సినిమాను తెలుగులో ధృవ గా రీమేక్ చేశారు... ఇటీవల రిలీజ్ అయిన ధృవ కు భారీ రెస్పాన్స్ వస్తుంది. సిద్ధార్ద్ అభిమన్యుగా అరవింద్ నటనకు విమర్శకుల ప్రశంసలు కూడా అందుతున్నాయి. కాగా ఈ సినిమా రిలీజైన తర్వాత అరవింద్ స్వామికి తెలుగులో క్రేజీ ఆఫర్స్ అందుతున్నాయి. కేవలం 7 రోజుల్లోనే 15 క్రేజీ ప్రాజెక్ట్స్ అరవింద్ స్వామి తలుపుతట్టాయి. కాగా వీటిలో ఇప్పటికీ 3 సినిమాలకు అరవింద్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది... కాగా హీరో నుంచి విలన్ గా మారి క్రేజీ ఆఫర్స్ అందుకొంటున్న జగపతి బాబుకి ఇప్పుడు అరవింద్ స్వామి పోటీగా మారాడు అని ఫిల్మ్ నగర్ లో టాక్ గా వినిపిస్తోంది. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com