నైజీరియా చర్చిలో ఘోర ప్రమాదం 160 మంది మృతి

- December 13, 2016 , by Maagulf
నైజీరియా చర్చిలో ఘోర ప్రమాదం 160 మంది మృతి

దక్షిణ నైజీరియాలో ఘోర ప్రమాదం జరిగింది.  స్థానిక కాలమానం ప్రకారం శనివారం రాత్రి ఉయో నగరంలోని రెయినర్స్ బైబిల్ ఇంటర్నేషనల్ చర్చిలో ప్రార్థనలు జరుగుతున్న సమయంలో చర్చి భవనం కూలిపోయింది.  అందులో ఉన్న 160 మంది చనిపోయారు.  వారి శవాలతో నగరంలో ఉన్న మార్చురీలన్నీ నిండిపోయాయని ఉయో యూనివర్శిటీలోని బోధానా దవానాఖానాకు చెందిన ఎటీట్ పీటర్స్ తెలిపారు.  మృతుల సంఖ్య ఇంకా ఎక్కువే ఉండే అవకాశం ఉన్నదన్నారు.  ఇంకా నిర్మాణ దశలోనే ఉన్న చర్చి భవనంలో జరుగుతున్న బిషప్ నియామకానికి సంబంధించిన ప్రార్థనా కార్యక్రమాలకు హాజరుకావడానికి పెద్ద సంఖ్యలో మతస్థులు వచ్చారు.  నిర్మాణానికి ఉపయోగిస్తున్న ఇనుప ఊచలు విరిగి భవన ఒక్కసారిగా కుప్పకూలి పోయింది.  పైకప్పు విరిగి అక్కడున్న వారి మీద పడింది.  దాంతో చాలామంది అక్కడికక్కడ చనిపోయారు.  ఆ సమయంలో ఆక్వా ఇటోమ్ రాష్ట్ర గవర్నర్ ఉడోమ్ ఇమ్మాన్యుయేల్, బిషప్ వీక్స్ కూడా చర్చిలో ఉన్నా ప్రమాదం నుంచి తప్పించుకున్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com