అమెరికాలో జరిగిన సైన్స్ పోటీల్లో విజేతలుగా భారత విద్యార్థులు

- December 13, 2016 , by Maagulf
అమెరికాలో జరిగిన సైన్స్ పోటీల్లో విజేతలుగా భారత విద్యార్థులు

అమెరికాలో జరిగిన సైన్స్ పోటీల్లో భారత సంతతికి చెందిన ముగ్గురు విద్యార్థులు విజేతలుగా నిలిచారు. పోటీల్లో గెలుపొందిన వారిలో ఆద్యా, శ్రియా బీసమ్ ఇద్దరు విద్యార్థినులు కవలలుగా ఉన్నారు.  వీరికి  2 మిలియన్ డాలర్లు (రూ.12.14 కోట్లు)ను స్కాలర్‌షిప్ క్రింద అందజేశారు. వీరు టక్సాస్‌లోని ప్లేనో స్కూల్‌లో 11 వ తరగతి చదువుతున్నారు.  ఈ పోటీల్లో విజేతగా నిలిచిన మరో సీనియర్ విద్యార్థి వినీత్‌కి ఒక మిలియన్ డాలర్లు (రూ.6.7 కోట్లు) బహుమతిని అందజేశారు.  వీరు చేసిన వినూత్న పరిశోధనలు షిజోఫ్రెనియాతో బాధపడుతున్న రోగులకు ఎంతగానో ఉపయోగపడతాయని వైద్యులు తెలిపారు.  గత మంగళవారం అమెరికాలో 17వ వార్షిక మ్యాథ్స్, సైన్స్ అండ్ టెక్నాలజీపై పోటీలు నిర్వహించారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com