పాన్ నిబంధనల మార్పు
- December 15, 2016
పెద్దనోట్ల రద్దు తర్వాత కేంద్ర ప్రభుత్వం పలు చట్టాల్లో మార్పు చేర్పులు చేస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా ఆదాయపన్ను చట్టంలోని శాశ్వత ఖాతా సంఖ్య (పాన్)కు సంబంధించిన 14(బి) నిబంధనను సవరించారు. ఈ మేరకు రూ.50,000 నుంచి రూ.2.5 లక్షల వరకు డిపాజిట్ చేసిన ఖాతాల పైనా ఐటీ అధికారులు నిఘా పెడతారు.
గతంలో పాన్ సంఖ్య ఇవ్వడం ఇష్టం లేనివారు రూ.50,000 కన్నా కొంచెం తక్కువ సొమ్మును పలుమార్లు జమ చేసేవారు. కొత్త నిబంధన ప్రకారం పాన్ సంఖ్య ఇవ్వకుండా ఒకే బ్యాంకు ఖాతాలో రూ.50,000 కన్నా తక్కువ మొత్తం పలు దఫాలుగా జమ చేసిన ఖాతాలపై ఇక నుంచి ఐటీ అధికారులు నిఘా ఉంచుతారు.
నవంబర్ 9 నుంచి డిసెంబర్ 30 మధ్య కాలంలో దఫదఫాలుగా రూ.2.5 లక్షలు అంతకన్నా ఎక్కువ జమ చేసిన బ్యాంకు ఖాతా వివరాలను బ్యాంకు అధికారులు ఐటీ విభాగానికి అందించాల్సి వుంటుంది.
తాజా వార్తలు
- టీమిండియాదే విజయం..కివీస్తో ఫైనల్ పోరుకు రెడీ..
- ఖమేనీ మృతికి అధికారికంగా సంతాపం తెలిపిన భారత్
- ICC Mens T20 World Cup 2026: భారత్ భారీ స్కోర్..
- అమెరికా ట్యాంకర్ పై దాడి చేసిన ఇరాన్
- గల్ఫ్ దేశాలకు ఇటలీ బాసట
- షార్జా ఛారిటీ రికార్డు: మొదటి 15 రోజుల్లోనే 4.5 లక్షల ఇఫ్తార్ భోజనాల పంపిణీ!
- అబూదాబీ ICAD 2పై డ్రోన్ శకలాలు: ఆరుగురికి గాయాలు..
- Dh15 మిలియన్ జాక్పాట్ కొట్టిన షార్జా డ్రైవర్..!!
- పబ్లిక్ ప్లేసుల్లో అలాచేస్తే..OMR 300 ఫైన్, 3 నెలల జైలు..!!
- రిలీఫ్ ఫ్లైట్స్..ఖతార్ ఎయిర్వేస్ బిగ్ అప్డేట్..!!









