పాన్‌ నిబంధనల మార్పు

- December 15, 2016 , by Maagulf
పాన్‌ నిబంధనల మార్పు

పెద్దనోట్ల రద్దు తర్వాత కేంద్ర ప్రభుత్వం పలు చట్టాల్లో మార్పు చేర్పులు చేస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా ఆదాయపన్ను చట్టంలోని శాశ్వత ఖాతా సంఖ్య (పాన్‌)కు సంబంధించిన 14(బి) నిబంధనను సవరించారు. ఈ మేరకు రూ.50,000 నుంచి రూ.2.5 లక్షల వరకు డిపాజిట్‌ చేసిన ఖాతాల పైనా ఐటీ అధికారులు నిఘా పెడతారు.
గతంలో పాన్‌ సంఖ్య ఇవ్వడం ఇష్టం లేనివారు రూ.50,000 కన్నా కొంచెం తక్కువ సొమ్మును పలుమార్లు జమ చేసేవారు. కొత్త నిబంధన ప్రకారం పాన్‌ సంఖ్య ఇవ్వకుండా ఒకే బ్యాంకు ఖాతాలో రూ.50,000 కన్నా తక్కువ మొత్తం పలు దఫాలుగా జమ చేసిన ఖాతాలపై ఇక నుంచి ఐటీ అధికారులు నిఘా ఉంచుతారు.
నవంబర్‌ 9 నుంచి డిసెంబర్‌ 30 మధ్య కాలంలో దఫదఫాలుగా రూ.2.5 లక్షలు అంతకన్నా ఎక్కువ జమ చేసిన బ్యాంకు ఖాతా వివరాలను బ్యాంకు అధికారులు ఐటీ విభాగానికి అందించాల్సి వుంటుంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com