విజయవాడలో 'ఖయ్యూం భాయ్'
- December 16, 2016
బెజవాడలోని కృష్ణవేణి మోటెల్ వద్ద గురువారం 'ఖయ్యూం భాయ్' చిత్ర షూటింగ్ జరిగింది. నవ్యాంధ్ర రాజధాని అమరావతిలో చిత్రీకరణ జరుపుతున్న మొదటి చిత్రం ఇది. ఇటీవల సంచలనం సృష్టించిన డాన్ నయీం ఉదంతంతో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. రాజధాని మందడం ప్రాంతానికి చెందిన కట్టా రాంబాబు ఈ సినిమాకు నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. అంతే కాకుండా ఈ చిత్రంలో ప్రధాన విలన్గా ఖయ్యూం (నయీమ్) పాత్ర పోషిస్తున్నారు.
ఈ సినిమాకు తారకరత్న పోలీసు అధికారిగా చేస్తున్నారు. రాజా చెయ్యి వేస్తే, మనమంతా, ఎవరు వంటి వరుస సినిమాల తర్వాత తారకరత్న గ్యాంగ్స్టర్ కథాంశంతో కూడిన చిత్రంలో నటిస్తున్నారు. తారకరత్న సరసన ఇద్దరు హీరోయిన్లు ప్రియాంక, హర్షితలు నటిస్తున్నారు. సంచలన చిత్రాలు తీసిన డైరెక్టర్ భరత ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు.
గ్యాంగ్స్టర్స్ను ఏరిపారేయాలన్న సందేశంతో ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నట్టు డైరెక్టర్ ఆంధ్రజ్యోతికి చెప్పారు. అమరావతి రాజధానిలో పూర్తి నిడివితో షూటింగ్ జరుపుకుంటున్న తొలి చిత్రం ఇది. దాదాపుగా 24 రోజులపాటు ఈ సినిమా షూటింగ్ రాజధాని ప్రాంతంలో వేర్వేరు చోట్ల జరగనున్నాయి. ఈ సినిమా పతాక సన్నివేశాలు బెజవాడ చుట్టుపక్కల జరుపుతున్నారు. మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు, నాని తదితరులు తమకు అన్ని విధాలా సహకారం అందించారని నిర్మాత కట్టా రాంబాబు ఆంధ్రజ్యోతికి చెప్పారు.
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







