మణిపూర్ రాజధాని ఇంఫాల్ లో కర్ఫ్యూ
- December 18, 2016
మణిపూర్ రాజధాని ఇంఫాల్ ఆదివారం హింసాత్మక ఘటనలతో అట్టుడికింది. ప్రజాసంఘాలిచ్చిన బంద్ సందర్భంగా ఉవ్వెత్తున హింసాత్మక ఘటనలు చోటుచేసుకున్నాయి. నాగా తెగలు విధించిన ఆర్థిక దిగ్బంధనం, ఉగ్రదాడులకు నిరసనగా ఈ బంద్ జరిగింది. రెచ్చిపోయిన ఆందోళనకారులు నాగా జిల్లాల కొండప్రాంతాల నుంచి ఇంఫాల్కు వస్తున్న పలు వాహనాలపై దాడులు చేశారు. కొన్నింటికి నిప్పు పెట్టారు. మరికొన్నింటిని ధ్వంసం చేశారు. ఒక బస్సును నేరుగా నదిలోకి తోసేశారు. అయితే ఈ హింసాత్మక ఘటనల్లో ఎవరూ మరణించినట్టు వార్తలు అందలేదు. మణిపూర్లో నవంబర్ నుంచి నాగా ఆదివాసీ తెగలు కొనసాగస్తున్న ఆర్థిక దిగ్బంధనంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
ఇంధనం, మందులు సహా నిత్యావసరాల ధరలు పెరిగిపోయాయి. గత గురువారం మూడు బాంబు పేలుళ్లు సంభవించగా, శుక్రవారం రాత్రి అతి పురాతన బాప్టిస్ట్ చర్చిపై దాడి జరిగింది. దీంతో ఇంఫాల్ వెస్ట్ జిల్లాలో ఇంటర్నెట్ సేవలను ప్రభుత్వం నిలిపివేసింది. శనివారం సైతం నాగా టెర్రరిస్టులుగా అనుమానిస్తున్న 70 మంది పోలీస్ పోస్ట్పై దాడి చేసి తొమ్మిది ఆటోమాటిక్ వెపన్స్ ఎత్తుకెళ్లారు. ఈ ఘటనలో ఇద్దరు పోలీసులు గాయపడ్డారు. తాజాగా ఆదివారం బంద్ సందర్భంగా జరిగిన హింసాత్మక ఘటనలతో నేపాల్ ఈస్ట్ జిల్లాలో నిరవధిక కర్ఫ్యూ విధించారు.
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







