బాగా చెమటలు పట్టిస్తే ఆరోగ్యానికి చాలా మంచిది....
- September 05, 2015
ఫ్యాన్, కూలర్స్ , ఏసిల కింద కూర్చొని చెమట పట్టనివ్వకుండా ఉన్నాసరే ఏదో తెలియని విసుగు ఉంటుంది. కాస్త పనిచేయగానే ఒత్తిడిగా ఫీలవుతారు. సహజసిద్ధంగా చేసే శారీరక శ్రమతో శరీరంలోని టాక్సిన్స్ వ్యర్థపదార్థాలు, మలినాలు అన్నీ చర్మందాటి బయటికి రావడానికి అవకాశముంటుంది. దాంతో చర్మ రంధ్రాలన్నీ తెరుచుకుని జిడ్డు, మురికి బయటికి వచ్చేస్తాయి. ముఖ్యంగా కొంత మన శరీరం అలసినప్పుడు చెమట పడితే, రెండవది వాతావరణం పరిస్థితుల ప్రభావం వల్ల చెమట పడుతుంది. అయితే చెమటపట్టకుండా జాగ్రత్తపడటం వలన కూడా అనారోగ్య సమస్యలు వస్తాయంటున్నారు వైద్యనిపుణులు. జిమ్, వ్యాయామాలు చేసి ఎంత అలసిసొలసి పనిచేస్తారో, ఏమేరకు చెమటలు పడతాయో అంతకన్నా ఎక్కువ ఆరోగ్యాన్ని సంతరించుకోవచ్చంటున్నారు నిపుణులు. మరి శరీరంలో చెమటలు పట్టించడం వల్ల ఆరోగ్యానికి కలిగే ప్రయోజనాలేంటో ఒక సారి చూద్దాం... చెమటలు పట్టించడం వల్ల గుండె మరింత వేగంగా పనిచేస్తుంది. శరీరంలో రక్తప్రసరణ మరింత మెరుగ్గా ఉంటుంది. ఈ ప్రొసెస్ లో శరీరంలో పుట్టే వేడి వల్ల శరీరం మరింత వేగంగా పనిచేయడానికి సహాయపడుతుంది. శరీరంలో చెమట ఎంత ఎక్కువగా పడితే అంత ఎక్కువ చర్మం శుభ్రపడుతుంది. దాంతో చర్మం మరింత ఆరోగ్యంగా, మాయిశ్చరైజర్ గా కనబడుతుంది. చెమట వల్ల శరీరంలో అదనపు నీరు కోల్పోవచ్చు మరియు అందువల్ల మరిన్ని ఎక్కువ నీరు త్రాగాలి. రోజులో ఎంత ఎక్కువ నీరు తీసుకుంటే కిడ్నీలకు అంత మంచిది. శరీరం ఎక్కువగా చెమట పట్టించడం ద్వారా మీ శరీరం నుండి టాక్సిన్స్ ను తొలగించుకోవచ్చు. వ్యాయామం లేదా జిమ్ వల్ల శరీరంలో చెమటలు పట్టిండ ద్వారా శరీరంలో కొన్ని మంచి కెమికల్స్ విడుదలవుతాయి. దాంతో మనస్సు ప్రశాంత పడుతుంది. చెమట వల్ల శరీరంలో యాంటీ బయోటిక్స్ చేరి జీవక్రియలకు అంతరాయం కలిగిస్తాయి. కాంట్టి, వాటిని నుండి రక్షణ కల్పించి మైక్రోఆర్గానిజమ్ చాలా ఎఫిషియంట్ గా పనిచేస్తుంది. చెమట పట్టడం వల్ల శరీరంలో గాయాలు మానుతాయని రీసెంట్ ఒక పరిశోధన ద్వారా తెలపడం జరిగినది చెమట పట్టడం మరియు వ్యాధినిరోధకత మద్య సంబంధం ఉన్నది. అందువల్లే ఆరోగ్య నిపుణులు చెమటలు పట్టించమని చెబుతుంటారు. వ్యామాలు, జిమ్ లను చేయమని సలహాలిస్తుంటారు. శరీరంలో చెమటలు పట్టడం వల్ల వేడి పుట్టి, జీవక్రియలు మరింత వేగంగా పనిచేస్తాయి . రక్తప్రసరణ మెరుగుపడుతుంది.
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







