కోన వెంకట్ ని రంగంలోకి దింపుతున్నయంగ్ టైగర్ ఎన్టీఆర్!
- December 19, 2016
త్వరలోనే యంగ్ టైగర్ ఎన్టీఆర్ మళ్లీ యాక్షన్ లోకి దిగబోతున్న విషయం తెలిసిందే. 'జనతా గ్యారేజ్' బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత చాలా కథలు విన్న తారక్.. చివరికి డాలీ చెప్పిన కథతో కనెక్ట్ అయ్యాడు. సంక్రాంతి తర్వాత నుంచి ఈ చిత్రం రెగ్యూలర్ షూటింగ్ జరుపుకోనుంది.
ఇందులో తారక్ త్రిపాత్రాభినయం చేయనున్నాడు. మూడు పాత్రలు కూడా నటనకి స్కోప్ ఉన్న పాత్రలే. దీంతో.. ఈ సినిమాని ఛాలెంజ్ గా తీసుకొన్నాడు తారక్. ఇందుకోసం పక్కగా ప్లాన్ చేసుకొంటున్నాడు. ఈ మూడు పాత్రలని తెరపై మెయింటెన్ చేయాలని బలమైన కలం కావాలి. డైలాగులు అదిరిపోవాలి. మూడు పాత్రలని కన్విన్స్ చేయగలిగే డైలాగ్ రచయిత కావాలి. అందుకోసం ప్రముఖ డైలాగ్ రైటర్ కోన వెంకట్ ని రంగంలోకి దింపుతున్నట్టు సమాచారమ్.
ప్రస్తుతం ప్రీ-ప్రొడక్షన్ పనులు జోరుగా సాగుతున్నాయి. కోన కూడా చిత్రబృందంతో కలసిపోయి పని ప్రారంభించారు. ఇప్పటికే ఎన్ టీఆర్ తో జతకట్టే ముగ్గురు ముద్దుగుమ్మలు కాజల్, నివేదా థామస్, అనుపమ పరమేశ్వరన్ లని ఎంపిక చేశారు. ఈ చిత్రాన్ని నందమూరి కల్యాణ్ రామ్ దాదాపు రూ. 100కోట్ల భారీ బడ్జెట్ తో తెరకెక్కించబోతున్నట్టు సమాచారమ్.
తాజా వార్తలు
- పెట్టుబడి ఒప్పందాలు వేగంగా అమల్లోకి రావాలి: సీఎం రేవంత్
- 'KHDA' ని సందర్శించిన దుబాయ్ క్రౌన్ ప్రిన్స్ షేక్ హమ్దాన్
- తెలంగాణ: ఆరుగురు సీనియర్ ఐపీఎస్ లకు పదోన్నతి
- కొత్త మెట్రో లైన్ నిర్మాణాన్ని ప్రకటించిన దుబాయ్ ప్రభుత్వం
- రూ.102 కోట్ల కేసులో రన్యాకు ఊరట
- మే 1 నుంచి ఆన్లైన్ గేమింగ్పై ఉక్కుపాదం: కొత్త నిబంధనలు ఇవే!
- భారత్కు ఇరాన్ మరో షాక్..
- బహ్రెయిన్లో తల్లి ప్రాణాలను కాపాడిన 6 ఏళ్ల చిన్నారి..!!
- రూమర్స్ కు దూరంగా ఉండాలని ప్రజలకు విజ్ఞప్తి..!!
- వాట్సాప్ ఉపయోగించకుండా బ్యాంకులపై యూఏఈ నిషేధం..!!









