కోన వెంకట్ ని రంగంలోకి దింపుతున్నయంగ్ టైగర్ ఎన్టీఆర్!
- December 19, 2016
త్వరలోనే యంగ్ టైగర్ ఎన్టీఆర్ మళ్లీ యాక్షన్ లోకి దిగబోతున్న విషయం తెలిసిందే. 'జనతా గ్యారేజ్' బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత చాలా కథలు విన్న తారక్.. చివరికి డాలీ చెప్పిన కథతో కనెక్ట్ అయ్యాడు. సంక్రాంతి తర్వాత నుంచి ఈ చిత్రం రెగ్యూలర్ షూటింగ్ జరుపుకోనుంది.
ఇందులో తారక్ త్రిపాత్రాభినయం చేయనున్నాడు. మూడు పాత్రలు కూడా నటనకి స్కోప్ ఉన్న పాత్రలే. దీంతో.. ఈ సినిమాని ఛాలెంజ్ గా తీసుకొన్నాడు తారక్. ఇందుకోసం పక్కగా ప్లాన్ చేసుకొంటున్నాడు. ఈ మూడు పాత్రలని తెరపై మెయింటెన్ చేయాలని బలమైన కలం కావాలి. డైలాగులు అదిరిపోవాలి. మూడు పాత్రలని కన్విన్స్ చేయగలిగే డైలాగ్ రచయిత కావాలి. అందుకోసం ప్రముఖ డైలాగ్ రైటర్ కోన వెంకట్ ని రంగంలోకి దింపుతున్నట్టు సమాచారమ్.
ప్రస్తుతం ప్రీ-ప్రొడక్షన్ పనులు జోరుగా సాగుతున్నాయి. కోన కూడా చిత్రబృందంతో కలసిపోయి పని ప్రారంభించారు. ఇప్పటికే ఎన్ టీఆర్ తో జతకట్టే ముగ్గురు ముద్దుగుమ్మలు కాజల్, నివేదా థామస్, అనుపమ పరమేశ్వరన్ లని ఎంపిక చేశారు. ఈ చిత్రాన్ని నందమూరి కల్యాణ్ రామ్ దాదాపు రూ. 100కోట్ల భారీ బడ్జెట్ తో తెరకెక్కించబోతున్నట్టు సమాచారమ్.
తాజా వార్తలు
- విద్యే సాధికారతకు మూలం: గవర్నర్
- దుబాయ్ మెరినా టవర్ పై డ్రోన్ అవశేషాలు పడిన ఘటన
- దుబాయ్: అల్ బర్షాలో వాహనం పై శిథిలాలు పడి ఒకరు మృతి
- ఇరాన్ ఓ లూజర్.. చాలా తీవ్రంగా దెబ్బతింటుంది: డొనాల్డ్ ట్రంప్
- యూఏఈలో మార్చి 20న ఈద్ అల్ ఫితర్? ఖగోళ శాస్త్రవేత్తల తాజా అంచనా!
- అబుదాబిలో ఇండెక్స్ రెస్టారెంట్ మూసివేత..!!
- దోహాకు పరిమితంగా ఫ్లైట్ సర్వీసులు: ఖతార్ ఎయిర్వేస్
- ఖతార్ లో ఫేక్ షెల్టర్ లొకేషన్ మెసేజులపై GCO క్లారిటీ..!!
- సివిల్ డిఫెన్స్ కు 90 అత్యవసర ఫిర్యాదులు..ఆల్ నార్మల్..!!
- కువైట్లో మత కలహాలను రెచ్చగొట్టే కుట్ర..13 మంది అరెస్టు..!!









