కోన వెంకట్ ని రంగంలోకి దింపుతున్నయంగ్ టైగర్ ఎన్టీఆర్!
- December 19, 2016
త్వరలోనే యంగ్ టైగర్ ఎన్టీఆర్ మళ్లీ యాక్షన్ లోకి దిగబోతున్న విషయం తెలిసిందే. 'జనతా గ్యారేజ్' బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత చాలా కథలు విన్న తారక్.. చివరికి డాలీ చెప్పిన కథతో కనెక్ట్ అయ్యాడు. సంక్రాంతి తర్వాత నుంచి ఈ చిత్రం రెగ్యూలర్ షూటింగ్ జరుపుకోనుంది.
ఇందులో తారక్ త్రిపాత్రాభినయం చేయనున్నాడు. మూడు పాత్రలు కూడా నటనకి స్కోప్ ఉన్న పాత్రలే. దీంతో.. ఈ సినిమాని ఛాలెంజ్ గా తీసుకొన్నాడు తారక్. ఇందుకోసం పక్కగా ప్లాన్ చేసుకొంటున్నాడు. ఈ మూడు పాత్రలని తెరపై మెయింటెన్ చేయాలని బలమైన కలం కావాలి. డైలాగులు అదిరిపోవాలి. మూడు పాత్రలని కన్విన్స్ చేయగలిగే డైలాగ్ రచయిత కావాలి. అందుకోసం ప్రముఖ డైలాగ్ రైటర్ కోన వెంకట్ ని రంగంలోకి దింపుతున్నట్టు సమాచారమ్.
ప్రస్తుతం ప్రీ-ప్రొడక్షన్ పనులు జోరుగా సాగుతున్నాయి. కోన కూడా చిత్రబృందంతో కలసిపోయి పని ప్రారంభించారు. ఇప్పటికే ఎన్ టీఆర్ తో జతకట్టే ముగ్గురు ముద్దుగుమ్మలు కాజల్, నివేదా థామస్, అనుపమ పరమేశ్వరన్ లని ఎంపిక చేశారు. ఈ చిత్రాన్ని నందమూరి కల్యాణ్ రామ్ దాదాపు రూ. 100కోట్ల భారీ బడ్జెట్ తో తెరకెక్కించబోతున్నట్టు సమాచారమ్.
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







