భారత ప్రధాన న్యాయమూర్తిగా నియమింపబడిన జస్టిస్ జె.ఎస్.ఖేహర్

- December 19, 2016 , by Maagulf
భారత ప్రధాన న్యాయమూర్తిగా నియమింపబడిన జస్టిస్ జె.ఎస్.ఖేహర్

భారత ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ జె.ఎస్.ఖేహర్ నియమితులయ్యారు. రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ సోమవారం జస్టిస్ ఖేహర్ నియామకానికి ఆమోద ముద్ర వేశారు. ప్రస్తుత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ టి.ఎస్.ఠాకూర్ వచ్చే ఏడాది జనవరి 3న పదవీ విరమణ చేయనున్నారు. 64 సంవత్సరాల ఖేహార్, సిక్కు మతం నుంచి చీఫ్ జస్టిస్ పదవి చేపట్టబోతున్న తొలి వ్యక్తి. జనవరి 4న బాధ్యతలు చేపట్టనున్న ఖేహర్ ఆ పదవిలో 2017 ఆగస్టు 27 వరకు కొనసాగుతారు. అరుణాచల్ ప్రదేశ్‌లో రాష్ట్రపతి పాలనపైన, ఎన్‌.జె.ఏ.సి. చట్టంపైన, సహారా అధిపతి సుబ్రత రాయ్ కేసుల్లో సంచలన తీర్పు వెలువరించిన సుప్రీం కోర్టు ధర్మాసనాల్లో ఖేహర్ కూడా ఉన్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com