భారత ప్రధాన న్యాయమూర్తిగా నియమింపబడిన జస్టిస్ జె.ఎస్.ఖేహర్
- December 19, 2016
భారత ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ జె.ఎస్.ఖేహర్ నియమితులయ్యారు. రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ సోమవారం జస్టిస్ ఖేహర్ నియామకానికి ఆమోద ముద్ర వేశారు. ప్రస్తుత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ టి.ఎస్.ఠాకూర్ వచ్చే ఏడాది జనవరి 3న పదవీ విరమణ చేయనున్నారు. 64 సంవత్సరాల ఖేహార్, సిక్కు మతం నుంచి చీఫ్ జస్టిస్ పదవి చేపట్టబోతున్న తొలి వ్యక్తి. జనవరి 4న బాధ్యతలు చేపట్టనున్న ఖేహర్ ఆ పదవిలో 2017 ఆగస్టు 27 వరకు కొనసాగుతారు. అరుణాచల్ ప్రదేశ్లో రాష్ట్రపతి పాలనపైన, ఎన్.జె.ఏ.సి. చట్టంపైన, సహారా అధిపతి సుబ్రత రాయ్ కేసుల్లో సంచలన తీర్పు వెలువరించిన సుప్రీం కోర్టు ధర్మాసనాల్లో ఖేహర్ కూడా ఉన్నారు.
తాజా వార్తలు
- పెట్టుబడి ఒప్పందాలు వేగంగా అమల్లోకి రావాలి: సీఎం రేవంత్
- 'KHDA' ని సందర్శించిన దుబాయ్ క్రౌన్ ప్రిన్స్ షేక్ హమ్దాన్
- తెలంగాణ: ఆరుగురు సీనియర్ ఐపీఎస్ లకు పదోన్నతి
- కొత్త మెట్రో లైన్ నిర్మాణాన్ని ప్రకటించిన దుబాయ్ ప్రభుత్వం
- రూ.102 కోట్ల కేసులో రన్యాకు ఊరట
- మే 1 నుంచి ఆన్లైన్ గేమింగ్పై ఉక్కుపాదం: కొత్త నిబంధనలు ఇవే!
- భారత్కు ఇరాన్ మరో షాక్..
- బహ్రెయిన్లో తల్లి ప్రాణాలను కాపాడిన 6 ఏళ్ల చిన్నారి..!!
- రూమర్స్ కు దూరంగా ఉండాలని ప్రజలకు విజ్ఞప్తి..!!
- వాట్సాప్ ఉపయోగించకుండా బ్యాంకులపై యూఏఈ నిషేధం..!!









