భారత ప్రధాన న్యాయమూర్తిగా నియమింపబడిన జస్టిస్ జె.ఎస్.ఖేహర్
- December 19, 2016
భారత ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ జె.ఎస్.ఖేహర్ నియమితులయ్యారు. రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ సోమవారం జస్టిస్ ఖేహర్ నియామకానికి ఆమోద ముద్ర వేశారు. ప్రస్తుత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ టి.ఎస్.ఠాకూర్ వచ్చే ఏడాది జనవరి 3న పదవీ విరమణ చేయనున్నారు. 64 సంవత్సరాల ఖేహార్, సిక్కు మతం నుంచి చీఫ్ జస్టిస్ పదవి చేపట్టబోతున్న తొలి వ్యక్తి. జనవరి 4న బాధ్యతలు చేపట్టనున్న ఖేహర్ ఆ పదవిలో 2017 ఆగస్టు 27 వరకు కొనసాగుతారు. అరుణాచల్ ప్రదేశ్లో రాష్ట్రపతి పాలనపైన, ఎన్.జె.ఏ.సి. చట్టంపైన, సహారా అధిపతి సుబ్రత రాయ్ కేసుల్లో సంచలన తీర్పు వెలువరించిన సుప్రీం కోర్టు ధర్మాసనాల్లో ఖేహర్ కూడా ఉన్నారు.
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







