పాక్ లో పెద్ద నోట్లకు షాక్
- December 19, 2016
పెద్ద నోట్ల రద్దుపై భారత్ తీసకున్న నిర్ణయం మాదిరిగానే పాకిస్థాన్ కూడా కీలక నిర్ణయం తీసుకుంది. నల్లధన ప్రవాహాన్ని ఆపేందుకు తమ దేశంలో చలామణిలో ఉన్న పెద్ద నోట్లను దశల వారీగా రద్దు చేయడానికి పాక్ సెనేట్ ఆమోదించింది. మొదటగా అతి పెద్ద నోటైన రూ.5000లను రద్దు చేసేందుకు ఒక తీర్మానాన్ని ఆమోదించిందించినట్లు డాన్ పత్రిక పేర్కొంది. పాకిస్థాన్ ముస్లీం లీగ్ పార్టీకి చెందిన సెనేటర్ ఉస్మాన్ సైఫ్ ఉల్లా ఖాన్ ఎగువ సభలో ఈ తీర్మానం ప్రవేశపెట్టారు. మెజారిటీ సభ్యుల మద్దతుతో సభ పొందింది. ఉస్మాన్ మాట్లాడుతూ బ్యాంకు అకౌంట్లను ప్రోత్సహించి, డిజిటల్ వ్యవస్థను పెంపొందించాలని, నగదు రహితంవైపు అభివృద్ధి కొనసాగించాలన్నారు.
న్యాయ శాఖ మంత్రి జాహిద్ హమిద్ దీనిపై స్పందిస్తూ ప్రస్తుతం ఈ చర్య ఆర్థిక వ్యవస్థ మీద ప్రభావం చూపుతుందని, కాని నదగదు రహిత దేశం దిశగా ముందడుగు వేయాల్సిన అవసరం ఉందన్నారు. ఈ ప్రక్షాళనతో మూడు నుంచి ఐదేళ్లలో పరిస్థితి మెరుగు పడుతుందని అన్నారు. ప్రస్తుతం దేశంలో 34 లక్షల నోట్లు ఉన్నాయని, అందులో 10.20 లక్షలు ఐదు వేల నోట్లేనని, వాటిని పూర్తిగా రద్దు చేస్తున్నట్లు పాక్ పత్రిక డాన్ పేర్కొంది.
తాజా వార్తలు
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!
- వాణిజ్య స్థలాల అద్దెపై కువైట్ ఫైర్ ఫోర్స్ కీలక సూచనలు..!!







