కమ్మని గొంతులు వినిపించబోతున్నాయి!!
- September 05, 2015
కెరీర్ స్టార్టింగ్ లో యాక్టింగ్, గ్లామర్ పైనే ఫోకస్ పెట్టే హీరోయిన్లు.. కుదురుకున్నాక టాలెంట్ చూపించే ప్రయత్నాలు చేస్తుంటారు. శ్రుతిహాసన్, నిత్యామీనన్ లాంటి హీరోయిన్లు యాక్టింగ్ లో ఇరగదీయమే కాకుండా.. సింగింగ్ లోనూ దుమ్ములేపుతున్నారు. ఇంకొందరు సొంతంగా డబ్బింగ్ చెప్పే ప్రయత్నాలు మొదలుపెడుతున్నారు. ఫిలిం ఇండస్ట్రీలో ఈ ట్రెండు ఇప్పుడు మరింత ఊపందుకుంటోంది. సమంత, తమన్నాలు ఇప్పటికే ట్రయిల్ రన్స్ వేశారు. శ్రీదేవి, త్రిషలాంటి సీనియర్లు కూడా సొంత గొంతుతో కిక్ ఇచ్చేందుకు రెడీ అవుతున్నారు. వీరిని స్ఫూర్తిగా తీసుకుని మరికొందరు స్టార్ హీరోయిన్లు కూడా ఓన్ వాయిస్ తో మెస్మరైజ్ చేసేందుకు ఇంట్రస్ట్ చూపిస్తున్నారు.
ఫిలింనగర్ లేటెస్ట్ న్యూస్ ఏంటంటే.. టాలీవుడ్ హాట్ కేక్స్ రకుల్ ప్రీత్ సింగ్, ప్రణీత.. సొంతంగా డబ్బింగ్ చెప్పుకోవాలని ఆరాటపడుతున్నారట. అప్పుడప్పుడు సినిమా ఫంక్షన్లలో వచ్చీరాని తెలుగులో మాట్లాడి ఆడియెన్స్ ను ఎంటర్ టైన్ చేసే ఈ ముద్దుగుమ్మలు.. తెలుగు లాంగ్వేజ్ పై పట్టు సాధించి మైక్ పట్టుకోవాలని చూస్తున్నారట. ప్రస్తుతం రకుల్, ప్రణీత ఇద్దరూ మంచి జోష్ మీద ఉన్నారు. ఇలాంటి టైమ్ లో సొంత గొంతు కూడా వినిపిస్తే.. ఆ కిక్కే వేరుగా ఉంటుందని.. ఆ ప్రయత్నాలను ముమ్మరం చేస్తున్నారట. భాష కాని భాషలో యాక్సెంట్ సెట్ అవుతుందా.. యాస.. ప్రాస వర్కౌట్ అవుతుందా అని సందేహాలు వ్యక్తం చేస్తున్నారు సినీజనాలు. మరి ఆన్ స్క్రీన్ పై ఈ సెక్సీ బ్యూటీస్ రియల్ వాయిస్ ఎలా ఉంటుందో చూడాలి.
తాజా వార్తలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!
- వాణిజ్య స్థలాల అద్దెపై కువైట్ ఫైర్ ఫోర్స్ కీలక సూచనలు..!!
- పర్యావరణ పరిరక్షణలో ఒమన్కు అంతర్జాతీయ గుర్తింపు..!!







