దిల్సుఖ్నగర్ పేలుళ్ల కేసులో ఐదుగురికీ మరణశిక్ష...!!
- December 20, 2016
మూడేన్నరేళ్ల క్రితం హైదరాబాద్లోని దిల్సుఖ్ నగర్లో జరిగిన జంట బాంబు పేలుళ్ల కేసులో దోషులుగా తేలిన ఐదుగురికి ఈ రోజు ఎన్ఐఏ కోర్టు శిక్ష ఖరారు చేసింది. దోషులుగా రుజువైన అసదుల్లా అక్తర్, వకాస్, తెహసీన్ అక్తర్, యాసిన్ భత్కల్, ఐజాజ్ లకు మరణశిక్ష విధిస్తున్నట్లు పేర్కొంది. అయితే, హైకోర్టు ఈ మరణశిక్షను ధ్రువీకరించాల్సి ఉంది. పేలుళ్ల నిందితుల్లో ఎలాంటి పశ్చాత్తాపం లేదని ఈ కేసును వాదించిన పబ్లిక్ ప్రాసిక్యూటర్ తెలిపారు. ఈ కేసులో విచారణ సందర్భంగా పలు ఆసక్తికర వాదనలు చోటుచేసుకున్నట్టు తెలుస్తోంది. నిందితులు కావాలని అమాయకులను పొట్టనబెట్టుకున్నారని ఆయన తెలిపారు.
వీరికి మరణించే వరకు ఉరిశిక్షే సరైనదని ఆయన పేర్కొన్నారు. ఈ కేసులో 157 మంది సాక్షులను విచారించిన అనంతరం వారిని ప్రశ్నించిన సందర్భంగా వారి వైఖరి ఊహించని విధంగా ఉందని, నిందితుల్లో తీవ్ర వైఖరి ఉందని న్యాయస్థానానికి తెలిపారు.
దిల్ షుక్ నగర్ పేలుళ్ల కేసులో దోషులకు శిక్షల ఖరారు తీర్పు నేపథ్యంలో హైదరాబాదు పోలీసులు అప్రమత్తమయ్యారు. దీంతో హైదరాబాదులోని సమస్యాత్మక ప్రాంతాల్లో భారీ బందో బస్తు చేపట్టారు. ఈ సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా చర్యలు చేపట్టారు.
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







