దిల్సుఖ్నగర్ పేలుళ్ల కేసులో ఐదుగురికీ మరణశిక్ష...!!
- December 20, 2016
మూడేన్నరేళ్ల క్రితం హైదరాబాద్లోని దిల్సుఖ్ నగర్లో జరిగిన జంట బాంబు పేలుళ్ల కేసులో దోషులుగా తేలిన ఐదుగురికి ఈ రోజు ఎన్ఐఏ కోర్టు శిక్ష ఖరారు చేసింది. దోషులుగా రుజువైన అసదుల్లా అక్తర్, వకాస్, తెహసీన్ అక్తర్, యాసిన్ భత్కల్, ఐజాజ్ లకు మరణశిక్ష విధిస్తున్నట్లు పేర్కొంది. అయితే, హైకోర్టు ఈ మరణశిక్షను ధ్రువీకరించాల్సి ఉంది. పేలుళ్ల నిందితుల్లో ఎలాంటి పశ్చాత్తాపం లేదని ఈ కేసును వాదించిన పబ్లిక్ ప్రాసిక్యూటర్ తెలిపారు. ఈ కేసులో విచారణ సందర్భంగా పలు ఆసక్తికర వాదనలు చోటుచేసుకున్నట్టు తెలుస్తోంది. నిందితులు కావాలని అమాయకులను పొట్టనబెట్టుకున్నారని ఆయన తెలిపారు.
వీరికి మరణించే వరకు ఉరిశిక్షే సరైనదని ఆయన పేర్కొన్నారు. ఈ కేసులో 157 మంది సాక్షులను విచారించిన అనంతరం వారిని ప్రశ్నించిన సందర్భంగా వారి వైఖరి ఊహించని విధంగా ఉందని, నిందితుల్లో తీవ్ర వైఖరి ఉందని న్యాయస్థానానికి తెలిపారు.
దిల్ షుక్ నగర్ పేలుళ్ల కేసులో దోషులకు శిక్షల ఖరారు తీర్పు నేపథ్యంలో హైదరాబాదు పోలీసులు అప్రమత్తమయ్యారు. దీంతో హైదరాబాదులోని సమస్యాత్మక ప్రాంతాల్లో భారీ బందో బస్తు చేపట్టారు. ఈ సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా చర్యలు చేపట్టారు.
తాజా వార్తలు
- మామిడి రసం తాగి 400 మందికి ఫుడ్ పాయిజన్.. 60 మంది పరిస్థితి విషమం!
- ఏపీ ప్రజలకు బిగ్ అలర్ట్..
- తెలంగాణ భవన్లో కేసీఆర్ కీలక సమావేశం
- తెలంగాణలో బస్సులు బంద్ ..ప్రభుత్వం ప్రత్యామ్నాయ ఏర్పాట్లు !
- రియాద్ లో ఘనంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు జన్మదిన వేడుకలు
- హాంకాంగ్లో ఘనంగా ఉగాది వేడుకలు
- దుబాయ్ ఎయిర్పోర్ట్ ని సందర్శించిన క్రౌన్ ప్రిన్స్ షేక్ హమ్దాన్
- తమిళనాడులో ముగిసిన ఎన్నికల ప్రచారం
- ఘనంగా గురూజీ రామ్ రతన్ జీ జయంతి వేడుకలు
- బాణసంచా ఫ్యాక్టరీలో పేలుడు..ఆరుగురు మృతి..









