'విరాట్' విశాఖకే..
- December 20, 2016
భారత నౌకాదళం నుంచి త్వరలో సేవలను ఉపసంహరించుకోనున్న ఐఎన్ఎస్ విరాట్ యుద్ధనౌకను సందర్శనశాల(మ్యూజియం)గా మార్చి, విశాఖపట్నంలో ఉంచుతామన్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రతిపాదనను కేంద్ర ప్రభుత్వం ఆమోదించింది. ఈ అంశంపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య కొద్ది నెలలుగా చర్చలు జరిగాయి. రాష్ట్ర ప్రభుత్వ పట్టుదల, గతంలో ఐఎన్ఎస్ కురుసుర జలాంతర్గామిని విశాఖపట్నంలో సందర్శనశాలగా ఏర్పాటు చేసి విజయవంతంగా నిర్వహించడం లాంటి అంశాలను పరిగణనలోకి తీసుకున్న కేంద్రం.. ఐఎన్ఎస్ విరాట్ను ఆంధ్రప్రదేశ్కు అప్పగించాలనే నిర్ణయానికొచ్చింది. 'విరాట్' అప్పగింతపై మంగళవారం ముంబయిలో నౌకాదళం నిర్వహించే కీలక సమావేశంలో పాల్గొనాల్సిందిగా ఏపీ ప్రభుత్వానికి ఆహ్వానం అందడంతో 13 మందితో కూడిన రాష్ట్ర అధికారుల బృందం సోమవారం బయల్దేరి వెళ్లింది.
వివిధ శాఖల సీనియర్ అధికారులతోపాటు విశాఖపట్నం నగరాభివృద్ధి సంస్థ(వుడా)కు చెందిన అధికారులూ బృందంలో ఉన్నారు. ఈ యుద్ధనౌకను సందర్శనశాలగా, నక్షత్ర హోటల్గా తీర్చిదిద్ది, విశాఖతీరంలో ఉంచే బాధ్యత తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే వుడాకు ఆదేశాలిచ్చింది. ఇందుకోసం రూ.1,700 కోట్ల వరకు వ్యయమవుతుందని నిపుణుల బృందం అంచనా వేసింది. 'విరాట్'ను ఉంచేందుకు విశాఖ నుంచి భీమునిపట్నం మధ్య తీరాన్ని ఆనుకుని ఉన్న మూడు ప్రాంతాలను అధికారులు పరిశీలిస్తున్నారు.
తాజా వార్తలు
- ఏపీ ప్రజలకు బిగ్ అలర్ట్..
- తెలంగాణ భవన్లో కేసీఆర్ కీలక సమావేశం
- తెలంగాణలో బస్సులు బంద్ ..ప్రభుత్వం ప్రత్యామ్నాయ ఏర్పాట్లు !
- రియాద్ లో ఘనంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు జన్మదిన వేడుకలు
- హాంకాంగ్లో ఘనంగా ఉగాది వేడుకలు
- దుబాయ్ ఎయిర్పోర్ట్ ని సందర్శించిన క్రౌన్ ప్రిన్స్ షేక్ హమ్దాన్
- తమిళనాడులో ముగిసిన ఎన్నికల ప్రచారం
- ఘనంగా గురూజీ రామ్ రతన్ జీ జయంతి వేడుకలు
- బాణసంచా ఫ్యాక్టరీలో పేలుడు..ఆరుగురు మృతి..
- ఆపిల్ కు కొత్త సీఈఓ జాన్ టెర్నస్









