'విరాట్' విశాఖకే..
- December 20, 2016
భారత నౌకాదళం నుంచి త్వరలో సేవలను ఉపసంహరించుకోనున్న ఐఎన్ఎస్ విరాట్ యుద్ధనౌకను సందర్శనశాల(మ్యూజియం)గా మార్చి, విశాఖపట్నంలో ఉంచుతామన్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రతిపాదనను కేంద్ర ప్రభుత్వం ఆమోదించింది. ఈ అంశంపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య కొద్ది నెలలుగా చర్చలు జరిగాయి. రాష్ట్ర ప్రభుత్వ పట్టుదల, గతంలో ఐఎన్ఎస్ కురుసుర జలాంతర్గామిని విశాఖపట్నంలో సందర్శనశాలగా ఏర్పాటు చేసి విజయవంతంగా నిర్వహించడం లాంటి అంశాలను పరిగణనలోకి తీసుకున్న కేంద్రం.. ఐఎన్ఎస్ విరాట్ను ఆంధ్రప్రదేశ్కు అప్పగించాలనే నిర్ణయానికొచ్చింది. 'విరాట్' అప్పగింతపై మంగళవారం ముంబయిలో నౌకాదళం నిర్వహించే కీలక సమావేశంలో పాల్గొనాల్సిందిగా ఏపీ ప్రభుత్వానికి ఆహ్వానం అందడంతో 13 మందితో కూడిన రాష్ట్ర అధికారుల బృందం సోమవారం బయల్దేరి వెళ్లింది.
వివిధ శాఖల సీనియర్ అధికారులతోపాటు విశాఖపట్నం నగరాభివృద్ధి సంస్థ(వుడా)కు చెందిన అధికారులూ బృందంలో ఉన్నారు. ఈ యుద్ధనౌకను సందర్శనశాలగా, నక్షత్ర హోటల్గా తీర్చిదిద్ది, విశాఖతీరంలో ఉంచే బాధ్యత తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే వుడాకు ఆదేశాలిచ్చింది. ఇందుకోసం రూ.1,700 కోట్ల వరకు వ్యయమవుతుందని నిపుణుల బృందం అంచనా వేసింది. 'విరాట్'ను ఉంచేందుకు విశాఖ నుంచి భీమునిపట్నం మధ్య తీరాన్ని ఆనుకుని ఉన్న మూడు ప్రాంతాలను అధికారులు పరిశీలిస్తున్నారు.
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







