బ్లాక్మనీపై 4 వేల ఈ-మెయిల్స్!
- December 20, 2016
నల్లధనం, అక్రమ లావాదేవీలపై సమాచారం అందించాలంటూ కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన ఈ-మెయిల్ అడ్రస్కు ప్రజా వేగుల (విజిల్ బ్లోయర్స్) నుంచి విశేష స్పందన వెల్లువెత్తుతోంది. blackmoneyinfo@incometax. gov.in కు కేవలం 72 గంటల్లో 4,000 పైగా ఈ మెయిళ్లు పోటెత్తినట్టు ఆర్థిక శాఖ అధికారి ఒకరు వెల్లడించారు. నల్లకుబేరులపై ఆదాయపన్ను అధికారులు, బ్యాంకు డిపాజిట్ల ఆధారంగా ఇతర దర్యాప్తు సంస్థల వద్ద ఇప్పటికే పెద్ద ఎత్తున సమాచారం ఉందనీ... నల్లధనాన్ని పసిగట్టడంలో ప్రజల నుంచి వచ్చిన సమాచారం మరింత అదనపు బలాన్ని ఇస్తుందని తెలిపారు. దీంతోపాటు లెక్కల్లో చూపని ఆదాయంపై ఆర్థిక నిఘా విభాగం (ఎఫ్ఐయూ) ద్వారా కూడా దర్యాప్తు జరుగుతోంది.
ప్రజావేగుల ఈ మెయిళ్ల ద్వారా అందిన వివరాలతో నల్లధనాన్ని వేళ్లతో సహా పెకిలించ వచ్చునని కేంద్రం భావిస్తోంది. ఐటీ, ఈడీ తదితర కేంద్ర దర్యాప్తు సంస్థలు దేశవ్యాప్తంగా విస్తృత సోదాలు నిర్వహించి పెద్దమొత్తంలో కరెన్సీ నోట్లను స్వాధీనం చేసుకుంటున్న విషయం తెలిసిందే. తాజా ఆదాయ వెల్లడి పథకం 'ప్రధాన మంత్రి గరీబ్ కల్యాణ్ యోజన' ప్రారంభం సందర్భంగా ఈ మెయిల్ అడ్రస్ను ప్రజలకు అందుబాటులోకి తెచ్చారు.
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







