జనతా పార్టీ-శిరోమణి అకాళీదల్ కూటమి భారీ విజయం..
- December 20, 2016
చండీగఢ్లో జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ-శిరోమణి అకాళీదల్ కూటమి భారీ విజయం సాధించింది. మొత్తం 26 స్థానాలకు ఎన్నికలు నిర్వహించగా దానిలో 20 సీట్లు భాజపా-అకాలీదళ్ కూటమి గెలుపొందగా, కాంగ్రెస్ నాలుగు స్థానాల్లో, స్వతంత్ర అభ్యర్థి ఒక స్థానంలో గెలుపొందినట్లు ఎన్నికల అధికారులు వెల్లడించారు. మొత్తం 26 వార్డులకు జరిగిన ఈ ఎన్నికల్లో 122 మంది అభ్యర్థులు పోటీ చేయగా వారిలో 67 మంది స్వతంత్ర అభ్యర్థులు ఉన్నారు. కాంగ్రెస్, భాజపా మొత్తం 26 స్థానాలకు పోటీపడగా బీఎస్పీ 17 వార్డుల్లో అభ్యర్థులను నిలిపింది. ఈ ఎన్నికల్లో 59.54శాతం పోలింగ్ నమోదైనట్లు అధికారులు చెప్పారు.
36 మంది సభ్యులు గల చండీగఢ్ మున్సిపల్ కార్పొరేషన్లో 26మంది ఎన్నికైన కౌన్సిలర్లు కాగా 9మంది నామినేటెడ్ కౌన్సిలర్లు ఉంటారు. మరొకరు స్థానిక ఎంపీ.
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







