జనతా పార్టీ-శిరోమణి అకాళీదల్ కూటమి భారీ విజయం..
- December 20, 2016
చండీగఢ్లో జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ-శిరోమణి అకాళీదల్ కూటమి భారీ విజయం సాధించింది. మొత్తం 26 స్థానాలకు ఎన్నికలు నిర్వహించగా దానిలో 20 సీట్లు భాజపా-అకాలీదళ్ కూటమి గెలుపొందగా, కాంగ్రెస్ నాలుగు స్థానాల్లో, స్వతంత్ర అభ్యర్థి ఒక స్థానంలో గెలుపొందినట్లు ఎన్నికల అధికారులు వెల్లడించారు. మొత్తం 26 వార్డులకు జరిగిన ఈ ఎన్నికల్లో 122 మంది అభ్యర్థులు పోటీ చేయగా వారిలో 67 మంది స్వతంత్ర అభ్యర్థులు ఉన్నారు. కాంగ్రెస్, భాజపా మొత్తం 26 స్థానాలకు పోటీపడగా బీఎస్పీ 17 వార్డుల్లో అభ్యర్థులను నిలిపింది. ఈ ఎన్నికల్లో 59.54శాతం పోలింగ్ నమోదైనట్లు అధికారులు చెప్పారు.
36 మంది సభ్యులు గల చండీగఢ్ మున్సిపల్ కార్పొరేషన్లో 26మంది ఎన్నికైన కౌన్సిలర్లు కాగా 9మంది నామినేటెడ్ కౌన్సిలర్లు ఉంటారు. మరొకరు స్థానిక ఎంపీ.
తాజా వార్తలు
- చర్చలు విఫలమైతే బాంబులే.. ట్రంప్ హెచ్చరిక
- ఇరాన్తో మునుపటి సంబంధాలు అసాధ్యం..!!
- డిఫెన్స్ ఫోర్స్ సన్నద్ధతను సమీక్షించిన కింగ్ హమద్ ..!!
- 1200 ఫ్లైట్స్ నడుపుతున్న జజీరా ఎయిర్వేస్..!!
- సౌదీ అరేబియాలో 1.6% తగ్గిన ప్రాపర్టీ ధరలు..!!
- బర్కాలో ఆసియా దేశస్థుడు అరెస్టు..!!
- ఖతార్కు విదేశీ విమానయాన సంస్థల సేవలు పునరుద్ధరణ..!!
- IPL 2026: గుజరాత్ పై ముంబై ఘన విజయం
- నటుడు జగపతిబాబు చేతుల మీదగా రామ్ కొణికి సరికొత్త 'కొణికి లక్స్' స్కిన్ కేర్ ప్రారంభం
- మే 1 నుంచి తిరుమలలో శ్రీవారి దర్శనానికి కొత్త నిబంధనలు









