పెయిన్ కిల్లర్స్ వేసుకుంటే ఏమవుతుంది?
- December 20, 2016
వళ్లు నొప్పులు, దేహంలో ఎక్కడైనా పట్టేసినట్లు అనిపిస్తే చాలు వెంటనే పెయిన్ కిల్లర్ మాత్ర తెచ్చుకుని వేసేసుకుంటుంటారు చాలామంది. ఐతే ఈ పెయిన్ కిల్లర్స్ వల్ల తాత్కాలికంగా నొప్పి తగ్గినప్పటికీ వేరు దుష్ఫలితాలు తలెత్తుతాయని ఇటీవలి పరిశోధనల్లో తేలింది. ముఖ్యంగా ఈ పెయిన్ కిల్లర్స్ను వాడేవారిలో అల్సర్, రక్తపోటు వంటి సమస్యలు తలెత్తే అవకాశం ఉందంటున్నారు.
కడుపులో మంట, నొప్పి, వాపు, కండరాలు, ఎముకలకు సంబంధించిన వ్యాధుల నివారణకు నాన్స్టెరాయిడల్ యాంటీ ఇన్ఫ్లామెటరి డ్రగ్స్ ఎక్కువగా ఉపయోగిస్తుంటారనీ, ఈ మందులు వాడినప్పుడు సదరు సమస్య తగ్గినప్పటికీ కొత్త సమస్య పట్టుకుంటుందని చెపుతున్నారు. ఈ పెయిన్ కిల్లర్స్ వల్ల గుండెపోటు కూడా రావచ్చని హెచ్చరిస్తున్నారు.
కనుక వైద్యులను సంప్రదించకుండా నొప్పి తగ్గేందుకు పెయిన్ కిల్లర్స్ వాడటం చాలా ప్రమాదకరం అని చెపుతున్నారు. కానీ వైద్యుల సలహా లేకుండా చాలామంది నొప్పులు తగ్గేందుకు మందుల షాపులో పెయిన్ కిల్లర్స్ కొనేసి వేసేసుకుంటున్నారనీ, దీనివల్ల తీవ్రమైన అనారోగ్య సమస్యలు తలెత్తుతాయని వారు హెచ్చరిస్తున్నారు.
తాజా వార్తలు
- డబ్బులు తీసుకుని వీసాలు ఇప్పిస్తామంటూ మోసాలు.. అప్రమత్తంగా ఉండాలని దుబాయ్ పోలీసుల హెచ్చరిక
- ఇరాన్ దాడులతో కువైట్లో చెలరేగిన మంటలు అదుపులోకి.. పలువురికి గాయాలు
- 72 వ జాతీయ చలనచిత్ర పురస్కారాలు ప్రకటింపు..
- FICCI FLO ప్రధాన కార్యాలయానికి వెయ్యి గజాల స్థలం కేటాయింపు: సీఎం రేవంత్
- అమెరికా పై ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ తీవ్ర విమర్శలు..
- కువైట్, బహ్రెయిన్, జోర్డాన్లపై ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన GCC
- హైదరాబాద్లో ‘ఆండ్ పర్పస్ ఫోరమ్ 2026’ సదస్సు
- దుబాయ్ పేలుళ్లపై తప్పుడు కథనం ప్రచురణ.. జర్నలిస్టు, బృందానికి యూఏఈ సమన్లు
- ప్రజాకవి అందె సీఎం రేవంత్ ఘన నివాళులు..
- బ్రెయిన్ ఇంజ్యూరీ నుంచి జాతీయ సేవలోకి..ఓ టీన్ స్ఫూర్తి ప్రయాణం..!!







