పరాయి దేశంలో ప్రాణాలు వదిలిన ‪#‎పర్శరాం‬

- September 06, 2015 , by Maagulf
పరాయి దేశంలో ప్రాణాలు వదిలిన ‪#‎పర్శరాం‬

కరీంనగర్ జిల్లా ,చందుర్తి మండలం మూఢపల్లి గ్రామానికి చెందిన గోలి లింగారెడ్డి-లలితమ్మ గార్ల రెండవ కుమారుడు(పర్శరాం) Ramu Golli గత నాలుగు సంవత్సరాల క్రితం బతుకుదేరువు కోసం సౌదీ అరేబియా దేశానికివెళ్ళాడు.అక్కడ ఒక కంఫనీ లో డ్రైవర్ గా పనిచేస్తున్న సమయంలో ప్రమాదవశాత్తు రెండు సంవత్సరాల క్రితం జరిగిన సంఘటనలో తలకు చిన్న గాయం తగిలింది.మామూలు గాయమే కదా అనీ ఆశ్రద్ద చేసిన పర్శరాం, ఆ గాయo విపరీతమైన నొప్పి రావడంతో, వారం రోజుల క్రితం తన దగ్గరలో వున్న స్వగ్రామానికి చెందిన స్నేహితుల సహకారంతో హస్పిటల్ వెళ్ళాడు.అప్పటికే తీవ్ర అవస్థతో వున్న పర్శరాం కి నోటిమాట, కాళ్లుచేతులకు స్పర్శ కూడ లేకపోవడంతో డాక్టర్ల్ చికిత్స కోసం ఫరీక్షలు నిర్వహిస్తే తలలో రక్తం గడ్డకట్టినట్టు తెలింది.వారం రోజుల నుండి ICU లో కోమాలో వున్న పర్శరాం శనివారం సాయంత్రం 4 గం॥ప్రాతంలో ప్రాణాలు విడిచాడు..

పర్శరాం మరణవార్త విన్న కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. గత సంవత్సరo సెలవు పై ఇంటికి వచ్చి వెళ్లిన కొడుకు తిరిగిరాని లోకాలకు పొయాడు అనీ వాపోతున్నారు.పది సంవత్సరాల క్రితం పర్శరాం వాళ్ల అన్న రవి కూడ ఆత్మహత్య చేసుకొని చనిపోయాడు.వున్న ఇద్దరు ఎదిగిన కొడుకులు మరణించడంతో తల్లిదండ్రులకు తీరని లోటు ఏర్పడింది,

దయచేసి పర్శరాం మృతదేహన్ని త్వరగా స్వగ్రామానికి రప్పించడానికి ప్రభుత్వం చొరవతీసుకోవాలని అలాగే వారి కుటుంబాన్ని ఆదుకోవాలనీ చేతులెత్తి విఙ్ఞప్తి చేస్తున్నా.

పర్శరాం నా క్లాస్ మేట్ అలాగే మంచి మనస్తత్వం వున్న మనిషి. నీ మరణం నా జీవితంలో తీరని లోటురా పర్శీ...నీవు ఎక్కడ వున్న నీ ఙ్ఞాఫకాలు మా వెన్నంటే వుంటాయి. నీ ఆత్మకి శాంతి చేకూరాలనీ ఆ దేవున్ని మనస్పూర్తిగా కోరుకుంటూ..అలాగే మీ కుటుంబ సభ్యులకు నా ప్రగాడ సానుభూతి తెలియజేస్తూ....నీ మిత్రుడు.

 

--యం.వాసుదేవ రావు(మాగల్ఫ్ ప్రతినిధి,బహ్రెయిన్)

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com