నేడు తిరుమలకు రానున్న శ్రీలంక ప్రధాని!

- December 20, 2016 , by Maagulf
నేడు తిరుమలకు రానున్న శ్రీలంక ప్రధాని!

శ్రీలంక ప్రధానమంత్రి రణిల్‌ విక్రమ సింఘే బుధవారం రెండు రోజుల పర్యటనకు తిరుపతి వస్తున్నట్లు కలెక్టర్‌ సిద్ధార్థజైన్‌ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. ప్రధాని బుధవారం సాయంత్రం 4.15 గంటలకు చెన్నై నుండి హెలికాప్టర్‌లో బయలుదేరి రేణిగుంట విమానాశ్రయం చేరుకుంటారు. 15 నిమిషాల త ర్వాత విమానాశ్రయం నుండి కారులో రోడ్డు మార్గాన బయలుదేరి 5.30 గంటలకు తిరుపతి మీదుగా తిరుమల వెళ్తారు. శ్రీకృష్ణ అతిథిగృహంలో విడిది చేస్తారు. రాత్రి 7.30 గంటలకు అతిథిగృహం నుంచి బయలుదేరి ఆలయం చేరుకొని శ్రీవారిని దర్శించుకుంటా రు. రాత్రి బస చేస్తారు. గురువారం ఉదయం వీఐపీ బ్రేక్‌ దర్శనంలో స్వామివారిని దర్శించుకుంటారు.

అల్పాహారం అనంతరం 8.15 గంటలకు తిరుమల నుండి కారులో బయలుదేరి 9.15గంటలకు రేణిగుంట విమానాశ్ర యం చేరుకుంటారు. 9.30 గంటలకు విమానాశ్రయం నుంచి హెలికాప్టర్‌లో చెన్నై విమానాశ్రయానికి వెళతారని కలెక్టర్‌ తెలిపారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com