300 కొత్త పథకాలు ఆవిష్కరించిన యూపీ సీఎం..

- December 20, 2016 , by Maagulf
300 కొత్త పథకాలు ఆవిష్కరించిన యూపీ సీఎం..

లఖ్‌నవూ: ఉత్తర్‌ప్రదేశ్‌ అసెంబ్లీఎన్నికలు ముంచుకొస్తున్న నేపథ్యంలో.. ముఖ్యమంత్రి అఖిలేశ్‌ యాదవ్‌ వరుసపెట్టి ప్రాజెక్టులు, పథకాలు ప్రారంభిస్తున్నారు. మంగళవారం కేవలం నాలుగు గంటల్లోనే ఆయన దాదాపు 300 కొత్త పథకాలు ఆవిష్కరించారు. ఐటీ ప్రాంగణం మొదలుకొని, ఆసుపత్రులు, గృహ నిర్మాణం, విద్యా సంస్థల ఏర్పాటు, స్విమ్మింగ్‌పూల్‌లు, రహదారుల నిర్మాణం తదితర ప్రాజెక్టులకు ఆయన శంకుస్థాపన చేసుకుంటూ పోయారు. వీటి మొత్తం విలువ రూ.50,000 కోట్ల వరకూ ఉంటుందని అంచనా. త్వరలో ఎన్నికల షెడ్యూల్‌ను ఎన్నికల సంఘం విడుదలచేయనుంది.

అనంతరం ఎన్నికల నియమావళి అమలులోకి వస్తుంది. ఈ లోగానే ప్రాజెక్టులన్నీ ఆవిష్కరించేయాలని ఆయన భావిస్తున్నట్లు కనిపిస్తోంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com