ఇండోనేషియాలో 6.6 తీవ్రతతో భూకంపం..
- December 20, 2016
ఇండోనేషియాలో బుధవారం ఉదయం భూకంపం సంభవించింది. భూకంపం తీవ్రత రిక్టర్ స్కేలుపై 6.6 గా నమోదైందని భూకంప అధ్యయన కేంద్రం అధికారులు వెల్లడించారు. 'మలుకు బరాత్ దయ' ప్రాంతానికి ఈశాన్యంగా 184 కిలోమీటర్ల దూరంలో, భూమిలోపల 173 కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రం ఉన్నట్లు అధికారులు వెల్లడించారని జిన్హువా వార్తా సంస్థ వెల్లడించింది.
భూకంప కేంద్రం చాలా లోతులో ఉన్నందున ఇది అంత ప్రమాదకరమైనది కాదని, సునామీ హెచ్చరికలు జారీ చేయలేదని అధికారులు వెల్లడించారు. భూకంప ప్రభావంతో ఎలాంటి ఆస్తి, ప్రాణనష్టం జరిగినట్లు ఇప్పటివరకు గుర్తించలేదని ఇండొనేషియా నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ ఏజెన్సీ ప్రతినిధి సుటోపో పుర్వో నుగ్రొహొ వెల్లడించారు.
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







