ఆమె ట్రంప్ కు మద్దతు.. నేను రాజీనామా..
- December 20, 2016
సాప్ట్ వేర్ దిగ్గజాలో ఒకటైన ఒరాకిల్ కంపెనీ సీఈవో సాఫ్రా కాట్జ్ అమెరికాకు ఎన్నికైన డొనాల్డ్ ట్రంప్ కు మద్దతుగా నిలుస్తున్నారనే నెపంతో తన పదవికే రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించారు ఓ సీనియర్ అధికారి. ట్రంప్ టీమ్ లో సాఫ్రా కాట్జ్ జాయిన్ అయ్యారని మండిపడుతూ ఒరాకిల్ డైరెక్టర్ జార్జ్ ఏ. పొలిస్నర్ తన రాజీనామా లేఖను లింక్డ్ఇన్ ద్వారా కంపెనీకి పంపించారు. ట్రంప్ పరివర్తన టీమ్ లో జాయిన్ అవుతూ సోషల్ సెక్యురిటీ, మెడికేర్, ఇమ్మిగ్రేషన్ పాలసీలపై తాము పనిచేస్తామని కాట్జ్ నిర్ణయం తీసుకున్నారు. అయితే తాను ట్రంప్ తో కలిసి పనిచేసేది లేదని, ఎట్టిపరిస్థితిల్లో ట్రంప్ కు సాయపడనని పేర్కొంటూ జార్జ్ ఒరాకిల్ కంపెనీకి లేఖ రాశారు.
ట్రంప్ విధానాలు రాజ్యాంగ విరుద్ధం, అనైతికం, నేరపూరితంగా ఉంటాయని ఆరోపించారు. ప్రతి సందర్భంలోనూ చట్టబద్ధంగా ఆయన్ను నేను వ్యతిరేసిస్తానని పేర్కొన్నారు.
లింక్డ్ఇన్ లో ఆయన పోస్టు చేసిన ఈ లేఖకు కనీసం 90 కామెంట్లు వచ్చాయి. వాటిలో చాలావరకు జార్జ్ కు మద్దతుగా నిలిచాయి. అయితే ఈ విషయంపై కంపెనీ అధికార ప్రతినిధి స్పందించలేదు. 1993 నుంచి జార్జ్ పొలిస్నర్ ఒరాకిల్ లో పనిచేస్తున్నారు. ఒరాకిల్ లో జాయిన్ అయిన దగ్గర్నుంచి వివిధ పదోన్నతులకు ఆయన బాధ్యత వహించారు. కన్సల్టింగ్, ప్రొడక్ట్ డెవలప్ మెంట్, కస్టమర్ అడ్వకసీ, ప్రొగ్రామ్ మేనేజ్ మెంట్, క్లౌడ్ వంటి వాటిలో ఆయన పనిచేశారు. డిసెంబర్ 15న టెక్ దిగ్గజాలతో ట్రంప్ నిర్వహించిన భేటీ అనంతరం కాట్జ్ ఆయనతో కలిసి పనిచేయనున్నట్టు వెల్లడించారు. ఒరాకిల్ సీఈవోగా ఉన్నంతవరకు ట్రంప్ తోనే కలిసి పనిచేస్తానని తెలిపిన సంగతి తెలిసిందే.
తాజా వార్తలు
- కువైట్లో భారీ డ్రగ్స్ వ్యతిరేక ఆపరేషన్.. ఎనిమిది మంది అరెస్ట్..!!
- ఆగస్టు నుంచి పీహెచ్సీసీ 'కేర్ సమ్మర్' కార్యక్రమం..!!
- ఇంధన రంగంలో సహకారంపై సౌదీ–భారత్ చర్చలు..!!
- సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టులు.. వ్యక్తి అరెస్ట్..!!
- ఒమన్లో జూలై 25 నుంచి 'పర్పుల్ శనివారం' ప్రారంభం..!!
- దుబాయ్లో 30 ఫుట్ ఓవర్ బ్రిడ్జీలపై స్మార్ట్ LED వ్యవస్థ..!!
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..







