బెర్లిన్లోని క్రిస్మస్ మార్కెట్లో ఉగ్రదాడికి పాల్పడింది మేమే: ఐసిస్..
- December 21, 2016
జర్మనీ రాజధాని బెర్లిన్లోని క్రిస్మస్ మార్కెట్లో జరిగిన ఉగ్రదాడికి పాల్పడింది తామేనని ఇస్లామిక్స్ స్టేట్స్ ఉగ్రవాద సంస్థ ప్రకటన చేసింది. ఐసిస్ ఉగ్రవాదులతో సంబంధాలు ఉన్న ఓ న్యూస్ ఏజెన్సీ ఈ మేరకు ప్రకటన విడుదల చేసింది. అంతర్జాతీయ కూటమిగా ఏర్పడిన దేశాలను లక్ష్యంగా చేసుకొని ఈ దాడి చేసినట్లు ఐసిస్ ప్రకటించుకుంది.
అమెరికాతో కలిసి సిరియా, ఇరాక్పై దాడి చేస్తున్న ఐఎస్ ఉగ్రవాదులకు వ్యతిరేకంగా జరిపే పోరాటంలో జర్మనీ భాగస్వామ్యం వహిస్తోంది. సోమవారం రాత్రి క్రిస్మస్ మార్కెట్లో ఉన్న పాదచారులపైకి ఓ నలుపు రంగు ట్రక్కు దూసుకెళ్లి బీభత్సం సృష్టించింది.
ఈ ప్రమాదంలో 12 మంది మృతి చెందగా, 50 మంది గాయపడ్డారు. వారిలో పలువురి పరిస్థితి విషమంగా ఉంది. ట్రక్కును నడిపిన పాకిస్థాన్కు చెందిన 23ఏళ్ల యువకుడిని జర్మనీ భద్రతా సిబ్బంది అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.
తాజా వార్తలు
- ప్రధాని మోదీతో సీఎం చంద్రబాబు భేటీ..
- ఖతర్లో భారతీయ రాయబారిగా తెలుగు దౌత్యవేత్త శ్రీకర్ రెడ్డి!
- సౌదీ అరేబియాతో 30 ఏళ్ల పౌర అణు ఒప్పందానికి డొనాల్డ్ ట్రంప్ ఆమోదం!
- గ్లోబల్ ఐకాన్స్ ఫోరం సొసైటీకి ఐఎస్వో 9001:2015 ప్రమాణీకృత సంస్థ గుర్తింపు
- కువైట్లో భారీ డ్రగ్స్ వ్యతిరేక ఆపరేషన్.. ఎనిమిది మంది అరెస్ట్..!!
- ఆగస్టు నుంచి పీహెచ్సీసీ 'కేర్ సమ్మర్' కార్యక్రమం..!!
- ఇంధన రంగంలో సహకారంపై సౌదీ–భారత్ చర్చలు..!!
- సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టులు.. వ్యక్తి అరెస్ట్..!!
- ఒమన్లో జూలై 25 నుంచి 'పర్పుల్ శనివారం' ప్రారంభం..!!
- దుబాయ్లో 30 ఫుట్ ఓవర్ బ్రిడ్జీలపై స్మార్ట్ LED వ్యవస్థ..!!







