కువైట్ ఆస్పత్రిలో చెన్నై వాసి: అండగా నిల్చిన టిడిపి నేతలు
- December 25, 2016
విమానంలో అమెరికా వెళుతున్న సమయంలో ఓ భారతీయునికి అస్వస్థత కలగడంతో విమాన సిబ్బంది.. కువైట్లో చికిత్స కోసం దింపేశారు. కాగా, విషయం తెలుసుకున్న తెలుగుదేశం కువైట్ శాఖ నేతలు వారికి అండగా నిలిచారు.
వివరాల్లోకి వెళితే.. చెన్నైకి చెందిన కస్తూరి రంగన్(70), లీలారంగన్ అనే దంపతులు తమ కుమారుడుని చూడటానికి అమెరికాకు కువైట్ ఎయిర్వేస్లో ప్రయాణమయ్యారు. ఈ విమానం కువైట్ మీదుగా అమెరికా వెళ్తోంది. కువైట్లో ట్రాన్సిట్ సమయంలో కస్తూరి రంగన్ అపస్మారక స్థితిలోకి వెళ్లారు. ఇది గమనించిన విమాన సిబ్బంది హుటాహుటిన కువైట్ ఏయిర్ పోర్ట్ అథారిటీ వారికి విషయాన్ని తెలియజేసి ఆయనను మెరుగైన చికిత్స కోసం కువైట్లోనే దించి వేశారు.అనంతరం కువైట్లోని ఫర్వానియా సూపర్ స్పెషాలిటీలో చేర్చారు. ఈ విషయం తెలుసుకున్న తెలుగుదేశం కువైట్ అధ్యక్షుడు కుదరవల్లి సుధాకర్ రావు .. తెలుగు సోషల్ వెల్ఫేర్ జిలకర మురళి, రవికుమార్కు తెలియజేశారు. వారికి అన్ని విధాలా సహకరించాలని కోరారు. దీంతో మురళి, రవికుమార్, జనరల్ సెక్రటరీ కొత్తపల్లి రాంమోహన్లు ఆస్పత్రికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు.
అమెరికాలో ఉన్న వారి కొడుకుకు సమాచారం అందించి ఎప్పటికప్పుడు విషయాలను తెలుపుతున్నారు. రంగన్ కుమారుడు కూడా ఉన్నఫలంగా కువైట్ బయల్దేరారు. సోమవారం వరకు ఆయన కువైట్ చేరుకుంటారు.
అలాగే ఇండియాలో ఉన్న మరో కొడుకు, కోడలు కూడా కువైట్ వచ్చేందుకు వీసా ఏర్పాట్లు చేస్తున్నట్లు సుధాకర్ తెలిపారు. ప్రస్తుతం లీలారంగన్ను ఓ తమిళ ఫ్యామిలీ వారు తమతో ఉంచుకుని వారి బాగోగులు చూసుకుంటున్నారు.
ఐసీయూలో వెంటిలేటర్ మీద ఉన్న కస్తూరి రంగన్ను కుదరవల్లి సుధాకర్ సందర్శించారు. సంబంధిత డాక్టర్లని సంప్రదించగా కస్తూరి రంగన్ ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని చెప్పారు. ముందుజాగ్రత్త చర్యగా ఇంకా వెంటిలేటర్ మీదనే ఉంచామని వైద్యులు తెలిపారు.



తాజా వార్తలు
- IPL 2026: గుజరాత్ పై ముంబై ఘన విజయం
- నటుడు జగపతిబాబు చేతుల మీదగా రామ్ కొణికి సరికొత్త 'కొణికి లక్స్' స్కిన్ కేర్ ప్రారంభం
- మే 1 నుంచి తిరుమలలో శ్రీవారి దర్శనానికి కొత్త నిబంధనలు
- JEE మెయిన్స్ తుది ఫలితాలు వచ్చేశాయ్..
- ఏపీకి కేంద్ర ప్రభుత్వం గొప్ప శుభవార్త
- కాంగ్రెస్ ప్రభుత్వంకు కేసీఆర్ డెడ్లైన్
- కరీంనగర్లో ఘనంగా 'కార్తికేయ జువెలరీస్' ప్రారంభోత్సవం
- యూఏఈలో ఉగ్రవాద సంస్థ భగ్నం: దేశ భద్రతను దెబ్బతీయాలన్న కుట్ర విఫలం
- బహ్లా కోటలో నాలుగు కొత్త మ్యూజియమ్స్ ప్రారంభం..!!
- ఖతార్ మున్సిపాలిటీలో ఈకో ఫ్రెండ్లీ వెహికల్స్, పరికరాలు..!!









