2017 జాయ్ ఆఫ్ లివింగ్: యూఏఈ ప్రెసిడెంట్..
- December 25, 2016
యూఏఈ ప్రెసిడెంట్ షేక్ ఖలీఫా బిన్ జాయెద్ అల్ నహ్యాన్, 2017వ సంవత్సరాన్ని 'ఇయర్ ఆఫ్ గివింగ్'గా ప్రకటించారు. సమాజానికి తిరిగివ్వాలనే గొప్ప ఉద్దేశ్యం దీని వెనుక ఉంది. సమాజం పట్ల బాధ్యతగా వ్యవహరిస్తూ, సామాజిక బాధ్యత కింద ప్రైవేట్ సెక్టార్, సేవా కార్యక్రమాలు ప్రారంభించేలా ప్రచారం కల్పించడం ముఖ్యం. ఇది 'ఇయర్ ఆఫ్ 2017'కి సంబంధించి మొదటి పిల్లర్. రెండో పిల్లర్ ఏంటంటే, స్పెషలైజ్డ్ వలంటీర్ ప్రోగ్రామ్స్ని నిర్వహించడం ద్వారా సోషల్ డెవలప్మెంట్, కమ్యూనిటీ సర్వీసెస్ని సులభతరం చేయడం. మూడో పిల్లర్, భవిష్యత్ తరాలు, దేశం పట్ల మరింత అంకిత భావంతో వ్యవహరించేలా వారిలో చైతన్యం పెంచడం. యూఏఈలో ఛారిటీ కార్యక్రమాలపై ఇప్పటికే అవగాహన అభినందించదగ్గ స్థాయిలోనే ఉందని, దాన్ని మరింతగా పెంచవలసిన అవసరం ఉందని షేక్ ఖలీఫా అభిప్రాయపడ్డారు. ఖచ్చితమైన లక్ష్యాలతో పై మూడు విభాగాల్లో పనిచేయాల్సిన అవసరం ఉందని ఆయన సూచించారు. 2016వ సంవత్సరాన్ని 'ఇయర్ ఆఫ్ రీడింగ్'గా ప్రకటించి, లక్ష్యాల్ని చేరుకున్నామని, అలాగే 2017వ సంవత్సరం కోసం నిర్దేశించుకున్న లక్ష్యాల్ని చేరుకునే దిశగా ప్రతి ఒక్కరూ కృషి చేయాలన్నారు షేక్ ఖలీఫా.
తాజా వార్తలు
- మెటా సేవలకు అంతరాయం..ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ డౌన్!
- ఇరాన్ రాయబారిని పిలిపించిన జోర్డాన్.. క్షిపణి దాడులు వెంటనే నిలిపివేయాలని డిమాండ్
- రాజమండ్రిలో తొలి కరోనా కేసు నమోదు
- అఖిలపక్ష సమావేశంలో పాల్గొన్న జనసేన పార్లమెంటరీ పార్టీ నేత బాలశౌరి
- అకాబా విమానాశ్రయం, పోర్టుకు ఎలాంటి ముప్పు లేదు: జోర్డాన్ ప్రభుత్వం
- సరికొత్త చరిత్ర సృష్టించిన పీవీ సింధు
- తిరుమలలో రూమ్ ఎలా పొందాలో తెలుసా?
- ఇరాన్ రెండో దాడితో కువైట్ విద్యుత్ కేంద్రంలో భారీ అగ్నిప్రమాదం.. అత్యవసర ప్రణాళికలు అమలు
- యూఏఈలో సీబీఎస్ఈ గ్రేడ్ 10 ఫలితాలు విడుదల..నెలల అనిశ్చితికి తెర..!!
- సౌదీలో భారీ స్మగ్లింగ్ యత్నాలు భగ్నం..!!







