ఖతార్లో జాబ్ ఛేంజ్: ఎగ్జాట్ వీసా తప్పనిసరి..
- December 25, 2016
ఖతార్లో ఉద్యోగాలు మార్చుకోవాలనుకునేవారు, ఖచ్చితమైన వీసా కలిగి ఉండాలి. ఓ కార్మికుడు వేరే ఉద్యోగంలోకి వెళ్ళాలంటే, కొత్త ఉద్యోగంలో ఒకే దేశానికి చెందిన వ్యక్తి ద్వారా ఆ కొత్త ఉద్యోగం ఖాళీ అవ్వాల్సి ఉంటుంది. డిసెంబర్ 13 నుంచి అమల్లోకి వచ్చిన చట్టం ప్రకారం ఎంట్రీ, ఎగ్జిట్ మరియు రెసిడెన్సీ విధానాల్లో మార్పులు చేర్పులు చోటుచేసుకున్నాయి. మినిస్ట్రీ ఆఫ్ అడ్మినిస్ట్రేటివ్ డెవలప్మెంట్, లేబర్ మరియు సోషల్ ఎఫైర్స్ ఈ అంశాలపై స్పష్టతనిచ్చింది. ఉదాహరణకు ఫిలిప్పీన్కి చెందిన మేల్ వర్కర్, తాను చేస్తున్న ఉద్యోగం నుంచి వేరే ఉద్యోగానికి వెళ్ళాలనుకుంటే అక్కడ కూడా అదే జాతీయుడి ద్వారా ఖాళీ అయిన పోస్ట్ ఉండి ఉండాలి. ఫిక్స్డ్ టెర్మ్ కాంట్రాక్ట్స్ మీదున్నవారు, కొత్త సంస్థలో చేరాలనుకుంటే, 30 రోజుల ముందు నోటీసు ఇవ్వవలసి ఉంటుంది. ఓపెన్ ఎండెడ్ కాంట్రాక్ట్ మీద ఉంటే, ఐదేళ్ళపాటు ఉద్యోగం కొనసాగిస్తేనే అర్హులవుతారు. ఇంకో వైపున 60 ఏళ్ళ వయసు పైబడినవారికి ఎంప్లాయ్మెంట్ కాంట్రాక్టుల పునరుద్ధరణ చేయరాదనే ఆలోచనల్ని చేస్తోంది మినిస్ట్రీ. ఇదిలా ఉండగా ఉద్యోగ మార్పుకి సంబంధించి ఎలాంటి సమస్యలున్నా, మినిస్ట్రీ ఆఫ్ అడ్మినిస్ట్రేటివ్ డెవలప్మెంట్, లేబర్ అండ్ సోషల్ ఎఫైర్స్కి సంబంధించిన టెక్నికల్ సపోర్ట్ టీమ్ ద్వారా పరిష్కరించుకునేందుకు అవకాశం కల్పిస్తున్నారు. సంబంధిత ఫోన్ నెంబర్ లేదా ఇ-మెయిల్ అడ్రస్ ద్వారా సహాయం పొందడానికి వీలుంది.
తాజా వార్తలు
- నిరాహార దీక్ష ఆపేది లేదు–సోనమ్ వాంగుక్ ప్రకటన
- ఇరాన్ దాడుల ప్రభావం.. బహ్రెయిన్, కువైట్, ఖతార్ విమానాలకు అంతరాయం
- ఏపీ విద్యార్థులకు సర్కార్ గుడ్ న్యూస్..
- డీజీపీ సీవీ ఆనంద్ ని కలిసిన క్రికెటర్ మహమ్మద్ సిరాజ్
- సెప్టెంబర్లో ప్రారంభం కాబోతున్న బిగ్ బాస్ సీజన్ 10
- బహ్రెయిన్ వైమానిక నావిగేషన్ పరికరాలే లక్ష్యం..అయినా విమాన రాకపోకలకు అంతరాయం లేదు
- ఢిల్లీ ఘటన పై తెలంగాణ సీఎం రేవంత్ ఫైర్..
- ఇరాన్ కొనసాగిస్తున్న దాడులు..కువైట్ పై క్షిపణులు, డ్రోన్లను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- ‘రాజు ఆమ్లెట్’ వ్యవస్థాపకుడు రాజీవ్ మెహెరిష్ కన్నుమూత
- యూఏఈలో భారతీయుల పాస్పోర్ట్ సేవలకు ఊరట.. అల్హింద్ ద్వారా తాత్కాలికంగా కాన్సులర్ సేవలకు సుప్ర







