ఇస్లాంని కించపర్చి వెయిటర్ పై దాడి చేసిన ఇంజినీర్ కు జైలు, దేశ బహిష్కరణ
- December 26, 2016
దుబాయ్: విద్య వివేకం కల్గించాలి..పరమత దూషణ ఎన్నడూ మంచిది కాదని బహుశా నేర్పించలేదేమో ఆ ఇంగితం లేని ఇంజినీర్ కు ... ప్రస్తుతం ఇక్కట్లు పడుతున్నాడు. కాఫీ షాపులోనికి వెళ్లిన ఇంజనీర్ ఎంచక్కా ఎలక్ట్రానిక్ గేమ్స్ ఆడుకోక ..వెయిటర్ తో వాదన పెట్టుకొన్నాడు తర్వాత ఇస్లాం మతంని కించపర్చి..ఆ అర్భకుడుపై దాడి చేశాడు. దీని ఫలితంగా మూడు నెలల జైలుశిక్ష ఆ తర్వాత దేశ బహిష్కరణ ఆ ఇంజినీర్ కు ప్రాప్తించాయి. పాలస్తీనా దేశానికి చెందిన 27 ఏళ్ల ఇంజనీర్ 2015 సంవత్సరంలో అల్ రిఫా లోని ఒక కాఫీ షాప్ వద్ద ఒక ఆటలాడుకొనే ఎలక్ట్రానిక్ లో ఆటలాడుతున్న సమయంలో వెయిటర్ తో ఒక వాడి వేడి వాదనకు దిగాడు. ఇస్లాం మతం ను నిందించాడు. ఆ పై వెయిటర్ పై దాడి చేసి కొట్టాడు. ఫస్ట్ ఇన్స్టాన్స్ దుబాయ్ కోర్ట్, ఒక మతంని కించపర్చి ఉల్లంఘించిన నేరానికి వెయిటర్ ను గాయపర్చినందుకు ప్రతివాదికి మూడు నెలల జైలు శిక్ష, తన శిక్షను పూర్తి చేసిన తరువాత నిందితుడిని దేశము నుండి పంపించి వేయాలని అధ్యక్షునిగా ఉన్న న్యాయమూర్తి మహ్మద్ జమాల్ ఆదివారం తీర్పు చెప్పారు.
తాజా వార్తలు
- నిరాహార దీక్ష ఆపేది లేదు–సోనమ్ వాంగుక్ ప్రకటన
- ఇరాన్ దాడుల ప్రభావం.. బహ్రెయిన్, కువైట్, ఖతార్ విమానాలకు అంతరాయం
- ఏపీ విద్యార్థులకు సర్కార్ గుడ్ న్యూస్..
- డీజీపీ సీవీ ఆనంద్ ని కలిసిన క్రికెటర్ మహమ్మద్ సిరాజ్
- సెప్టెంబర్లో ప్రారంభం కాబోతున్న బిగ్ బాస్ సీజన్ 10
- బహ్రెయిన్ వైమానిక నావిగేషన్ పరికరాలే లక్ష్యం..అయినా విమాన రాకపోకలకు అంతరాయం లేదు
- ఢిల్లీ ఘటన పై తెలంగాణ సీఎం రేవంత్ ఫైర్..
- ఇరాన్ కొనసాగిస్తున్న దాడులు..కువైట్ పై క్షిపణులు, డ్రోన్లను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- ‘రాజు ఆమ్లెట్’ వ్యవస్థాపకుడు రాజీవ్ మెహెరిష్ కన్నుమూత
- యూఏఈలో భారతీయుల పాస్పోర్ట్ సేవలకు ఊరట.. అల్హింద్ ద్వారా తాత్కాలికంగా కాన్సులర్ సేవలకు సుప్ర







