'గౌతమీపుత్ర' ఆడియో విడుదల
- December 26, 2016
తిరుపతిలో శ్రీ వేంకటేశ్వరస్వామి పాదాల చెంత నిర్వహిస్తున్న గౌతమీపుత్ర శాతకర్ణి ఆడియో ఫంక్షన్లో తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు ప్రత్యక్షమై అభిమానులను ఉర్రూతలూగించారు. ఆయన కనిపించగానే అతిథులు సహా నందమూరి అభిమానులు కేరింతలు కొట్టారు. అయితే కేసీఆర్ ప్రత్యక్షమైంది అక్కడ ఏర్పాటు చేసిన బిగ్ స్ర్కీన్పై కావడం గమనార్హం. ఈ సినిమా విశేషాలు గురించి చెబుతున్న యాంకర్ గతంలో ఈ సినిమా ప్రారంభోత్సవ సమయంలో కీర్తించిన ప్రముఖుల గురించి వివరించారు. ఈ సందర్భంగా అప్పటి వీడియోను అక్కడి తెరపై ప్రదర్శించారు. సీఎం కేసీఆర్ సహా టాలీవుడ్ ప్రముఖ హీరోలు బాలకృష్ణను కీర్తించారు. దీంతో కార్యక్రమంలో ఒక్కసారిగా కరతాళ ధ్వనులు వినిపించాయి.
తాజా వార్తలు
- ఖమేనీ మృతికి అధికారికంగా సంతాపం తెలిపిన భారత్
- ICC Mens T20 World Cup 2026: భారత్ భారీ స్కోర్..
- అమెరికా ట్యాంకర్ పై దాడి చేసిన ఇరాన్
- గల్ఫ్ దేశాలకు ఇటలీ బాసట
- షార్జా ఛారిటీ రికార్డు: మొదటి 15 రోజుల్లోనే 4.5 లక్షల ఇఫ్తార్ భోజనాల పంపిణీ!
- అబూదాబీ ICAD 2పై డ్రోన్ శకలాలు: ఆరుగురికి గాయాలు..
- Dh15 మిలియన్ జాక్పాట్ కొట్టిన షార్జా డ్రైవర్..!!
- పబ్లిక్ ప్లేసుల్లో అలాచేస్తే..OMR 300 ఫైన్, 3 నెలల జైలు..!!
- రిలీఫ్ ఫ్లైట్స్..ఖతార్ ఎయిర్వేస్ బిగ్ అప్డేట్..!!
- డ్రోన్, 2 క్రూజ్ మిస్సైళ్లతో ఇరాన్ అటాక్..రాస్ తనురా సేఫ్..!!









