పెరల్ హార్బర్ను సందర్శించనున్న జపాన్ ప్రధాని..
- December 26, 2016
జపాన్ ప్రధాని షింజో అబే అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామాతో కలిసి పెరల్ హార్బర్ను సందర్శించనున్నారు. రెండో ప్రపంచ యుద్ధంలో పెరల్ హార్బర్పై జపాన్ దాడిని అతిపెద్ద మలుపుగా పేర్కొంటారు. ఈ ఘటనతో అమెరికా 2300 సైనికులను నష్టపోయింది. దీంతో అమెరికా యుద్ధ రంగంలోకి దిగి జపాన్పై అణుదాడి చేయాల్సి వచ్చింది. ఈ నేపథ్యంలో అబే పర్యటన ప్రాధాన్యం సంతరించుకుంది. సందర్శనలో భాగంగా అబే మృతుల ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తారు కానీ ఎటువంటి క్షమాపణలు చెప్పరని జపాన్ అధికార వర్గాలు తెలిపాయి. అనంతరం హవాయిలోని జరిగే సమావేశంలో ఒబామాతో కలిసి పాల్గొంటారు. పెరల్ హార్బర్ ఘటన జరిగి 75 సంవత్సరాలు పూర్తైన తర్వాత మూడు వారాలకు అబే అమెరికాను సందర్శిస్తున్నారు.
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







