కొత్త జీవితంలోకి క్షమాభిక్ష పొందిన ఖైదీలు..
- December 27, 2016
షార్జా రూలర్, సుప్రీం కౌన్సిల్ మెంబర్ డాక్టర్ షేక్ సుల్తాన్ బిన్ అల్ ఖాసిమి, 180 మంది ఖైదీలకు క్షమాభిక్ష ప్రసాదించారు. ఇందులో వివిధ దేశాలకు చెందిన ఖైదీలు ఉన్నారు. ఈ విషయాన్ని షార్జా పోలీస్ ఉన్నతాధికారి 'వార్షిక జిజిజి యునిఫైడ్ ఇన్మేట్స్' వీక్లో ప్రకటించారు. క్షమాభిక్ష పొందిన 20 మంది ఖైదీల డెబిట్స్ని షార్జా ఛారిటీ అసోసియేషన్ భరిస్తోంది. ఇంకో వైపున 13 మంది ఖైదీలకు డెంటల్ ట్రీట్మెంట్ని షార్జా చారిటీ చేయిస్తోంది. జోర్డాన్కి చెందిన ఉమ్ మొహమ్మద్ అనే మహిళ తన కుమారుడికి క్షమాభిక్ష లభించడం పట్ల హర్షం వ్యక్తం చేసింది. క్షమాభిక్ష పొందిన ఖైదీలు ఇకపై సాధారణ పౌరుల్లా జీవించాలని ఆకాంక్షించారు. ఖైదీలు జైలు జీవనం గడిపిన సమయంలో వారి నడవడిక, అలాగే ఆయా వ్యక్తులు అంతకు ముందు చేసిన నేరాల్ని పరిగణనలోకి తీసుకుని, వారికి క్షమాభిక్ష ప్రసాదించడం జరిగింది. ఇంకో వైపున ఖైదీల కుటుంబాలకు పలు బహుమతుల్ని, గిఫ్ట్ వోచర్స్ని షార్జా కో-ఆపరేటివ్ సొసైటీ అందించింది. ఎలక్ట్రానిక్ డివైజెస్, హోమ్ అప్లయెన్సెస్ - ఎమిరేట్స్ రెడ్ క్రిసెంట్ ద్వారా బహుమతుల రూపంలో అందాయి.
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







