కొత్త జీవితంలోకి క్షమాభిక్ష పొందిన ఖైదీలు..

- December 27, 2016 , by Maagulf
కొత్త జీవితంలోకి క్షమాభిక్ష పొందిన ఖైదీలు..

షార్జా రూలర్‌, సుప్రీం కౌన్సిల్‌ మెంబర్‌ డాక్టర్‌ షేక్‌ సుల్తాన్‌ బిన్‌ అల్‌ ఖాసిమి, 180 మంది ఖైదీలకు క్షమాభిక్ష ప్రసాదించారు. ఇందులో వివిధ దేశాలకు చెందిన ఖైదీలు ఉన్నారు. ఈ విషయాన్ని షార్జా పోలీస్‌ ఉన్నతాధికారి 'వార్షిక జిజిజి యునిఫైడ్‌ ఇన్‌మేట్స్‌' వీక్‌లో ప్రకటించారు. క్షమాభిక్ష పొందిన 20 మంది ఖైదీల డెబిట్స్‌ని షార్జా ఛారిటీ అసోసియేషన్‌ భరిస్తోంది. ఇంకో వైపున 13 మంది ఖైదీలకు డెంటల్‌ ట్రీట్‌మెంట్‌ని షార్జా చారిటీ చేయిస్తోంది. జోర్డాన్‌కి చెందిన ఉమ్‌ మొహమ్మద్‌ అనే మహిళ తన కుమారుడికి క్షమాభిక్ష లభించడం పట్ల హర్షం వ్యక్తం చేసింది. క్షమాభిక్ష పొందిన ఖైదీలు ఇకపై సాధారణ పౌరుల్లా జీవించాలని ఆకాంక్షించారు. ఖైదీలు జైలు జీవనం గడిపిన సమయంలో వారి నడవడిక, అలాగే ఆయా వ్యక్తులు అంతకు ముందు చేసిన నేరాల్ని పరిగణనలోకి తీసుకుని, వారికి క్షమాభిక్ష ప్రసాదించడం జరిగింది. ఇంకో వైపున ఖైదీల కుటుంబాలకు పలు బహుమతుల్ని, గిఫ్ట్‌ వోచర్స్‌ని షార్జా కో-ఆపరేటివ్‌ సొసైటీ అందించింది. ఎలక్ట్రానిక్‌ డివైజెస్‌, హోమ్‌ అప్లయెన్సెస్‌ - ఎమిరేట్స్‌ రెడ్‌ క్రిసెంట్‌ ద్వారా బహుమతుల రూపంలో అందాయి. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com