భారత్ రైల్వేస్టేషన్లలో ఫ్రీ వైఫై
- December 27, 2016
నాటికి దేశంలోని దాదాపు 400 రైల్వేస్టేషన్లలో ఫ్రీ వైఫై అందుబాటులోకి తెచ్చే విధంగా చర్యలు తీసుకుంటున్నట్లు రైల్వే అధికారులు తెలిపారు. ఇటీవల కేరళలోని కొల్లం రైల్వేస్టేషన్లో ఉచిత వైఫై ఏర్పాటు చేయటంతో 2016లో ఏర్పాటు చేసిన వాటి సంఖ్య 100కు చేరిందని తెలిపారు. అయితే 2017లో 400 స్టేషన్లలో ఉచిత వైఫై సదుపాయాన్ని అందించేందుకు ప్రయత్నిస్తున్నట్లు తెలిపారు.
'ముంబయి స్టేషన్ నుంచి మొదలు పెట్టి.. దక్షిణ భాగంలో కొల్లం స్టేషన్ వరకు ఉచిత వైఫై సదుపాయం కల్పించాం. దీంతో ఈ ఏడాది గూగుల్ సహాయంతో రద్దీగా ఉండే 100 రైల్వేస్టేషన్లలో వైఫై సదుపాయాన్ని ఏర్పాటు చేసినట్లయింది.
వచ్చే ఏడాది 400 మేజర్ స్టేషన్లలో ఈ సదుపాయం కల్పిస్తాం' అని రైల్వేశాఖ అధికారి ఒకరు తెలిపారు.
2016 జనవరిలో రైల్వే శాఖ ముంబయి సెంట్రల్ రైల్వే స్టేషన్లో ఉచిత వైఫై సదుపాయాన్ని ప్రారంభించింది. అది మొదలుకొని భువనేశ్వర్, బెంగళూరు, హౌరా, కాన్పూర్, మథుర, అలీగఢ్, బరేలీ, వారణాసి తదితర స్టేషన్లలో ఈ సదుపాయం కల్పించింది. దీంతో దాదాపు కోటి మంది ప్రయాణికులు రైల్వేస్టేషన్లో వైఫైని ఉపయోగించుకుంటున్నారు. దీంతో ప్రయాణికులు వారికి కావాల్సిన పుస్తకాలు, గేమ్స్, సమాచారాన్ని క్షణాల్లో పొందుతున్నారని రైల్వే అధికారులు తెలిపారు.
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







