2017 జనవరి 9 వ తేదీన కువైట్ లో 'ప్రవాస భారతీయ దివస్'
- December 27, 2016
ప్రతి సంవత్సరం జనవరి 9 వ తేదీన ప్రవాస భారతీయ దివస్ ను జరుపుకుంటారు. మహాత్మాగాంధీ దక్షిణాఫ్రికా నుంచి 1915 జనవరి 9న భారతదేశానికి తిరిగి వచ్చారు. దీనికి చారిత్రకంగా గుర్తిస్తూ ఈ తేదికి అత్యంత ప్రాధాన్యం ఉంది. 2003 నుండి, భారతదేశం ప్రభుత్వం భారతదేశం లో ప్రవాసి భారతీయ దివస్ నిర్వహిస్తుంది. సుదూర ప్రాంతాలలో ఉన్న ప్రవాస భారతీయ సమాజం భారతదేశం అభివృద్ధిలో సహకారం గుర్తుగా ప్రతి సంవత్సరం జరుపుతున్నారు. కువైట్ నివసిస్తున్న భారతీయులు భారతదేశం మరియు కువైట్ దేశాల మధ్య అన్ని రంగాల్లో పెరుగుతున్న సంబంధాల పెంపులో వారి ఘనమైన పాత్రను పోషిస్తున్నారు. ఆ సందర్భానికి గుర్తుగా, " ప్రవాసి భారతీయ దివస్ 2017 " భారతదేశం యొక్క రాయబార కార్యాలయం ఆడిటోరియం వద్ద జనవరి 9 వ తేదీ సోమవారం 2017 ( 'రీడిఫైనింగ్ ఎంగేజ్మెంట్ ఇండియన్ డయాస్పోరా) అనే అంశం కింద నిర్వహించనున్నారు. ప్రవాస భారతీయులందరు ఈ కార్యక్రమానికి హాజరుకావాలని పి ఐ ఓ మరియు ఓ సి ఐ కార్డుదారులకు మరియు కువైట్ లో ఉన్నవారి స్నేహితులను సాదరంగా ఆహ్వానిస్తున్నట్లు తెలిపారు. ఇండియన్ డయాస్పోరా కు సంబంధించిన సమస్యలపై అర్ధవంతమైన చర్చలో పాల్గొనేందుకు రావాల్సిందిగా కోరారు.
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







