శ్రీలంక మాజీ ప్రధాని మృతి

- December 27, 2016 , by Maagulf
శ్రీలంక మాజీ ప్రధాని మృతి

శ్రీలంక మాజీ ప్రధాని రత్నసిరి విక్రమనాయకే(83) కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మంగళవారం తుదిశ్వాస విడిచారు. 2005 నుంచి 2010 వరకు శ్రీలంక అధ్యక్షుడిగా మహీంద్ర రాజపక్సే పనిచేసిన సమయంలో రత్నసిరి ప్రధానిగా బాధ్యతలు నిర్వర్తించారు. శ్రీలంక ఫ్రీడమ్‌ పార్టీలో 60 ఏళ్లకుపైగా సభ్యుడిగా ఉన్నారు. రత్నసిరి మృతి పట్ల శ్రీలంక అధ్యక్షుడు మైత్రీపాల సిరిసేన, పలువురు రాజకీయ ప్రముఖులు సంతాపం తెలిపారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com