కేరళ విమానాశ్రయాల వెబ్సైట్లు హ్యాక్ చేసిన పాక్ హ్యాకర్ల!
- December 28, 2016
కొచ్చిన్, తిరువనంతపురం విమానాశ్రయాల వెబ్సైట్లు హాక్కు గురయ్యాయి. పాకిస్థాన్ సైబర్ అటాకర్స్ గ్రూప్ పేరిట ఈ హ్యాకింగ్ పాల్పడ్డారు. 'we are unbeatable.. mess with the best die like the rest' అనే సందేశాన్ని కూడా పోస్ట్ చేశారు.
అంతేగాక, ఈ వెబ్సైట్లు 'కాశ్మీరీ చీతా'చే హ్యాకింగ్ చేయబడ్డాయని పేర్కొన్నారు హ్యాకర్లు. హ్యాకింగ్ విషయం బుధవారం వెలుగులోకి వచ్చిన వెంటనే దీనిపై సంబంధిత అధికారులు విచారణ చేపట్టారు. సైబర్ సెక్యూరిటీ అధికారులు దీనిపై నిశితంగా పరిశీలిస్తున్నారు.
హ్యాకింగ్ వెనక ఎవరున్నారనే విషయం ఇప్పటి వరకు తెలియరాలేదని ఇంటెలిజెన్స్ బ్యూరో అధికారులు..
కేరళ వన్ఇండియాకు తెలిపారు. www.cochinairport.com and trivandrumairport.com ఈ రెండు వెబ్ సైట్లు హ్యాకింగ్కు గురయ్యాయి.
కాగా, ఈ వెబ్సైట్లను పునరుద్ధరించే పనిలో ఉన్నారు అధికారులు. విమానాల రాకపోకలకు సంబంధించిన అన్ని వివరాలు ఈ వెబ్సైట్లలో ఉన్నందున దీన్ని కొంత ఆందోళన చెందే అంశంగా అధికారులు భావిస్తున్నారు. హ్యాకింగ్ చేసిన వాళ్లు స్థానికులు కాదని సైబర్ సెక్యూరిటీ అధికారులు చెబుతున్నారు. కేరళ బయటి నుంచే ఈ హ్యాకింగ్ జరిగిందని చెప్పారు. మొదట వెబ్సైట్లను పునరుద్ధరించిన అనంతరం హ్యాకర్ల పనిపడతామని అధికారులు తెలిపారు.
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







