2000 మంది విమాన ప్రయాణీకులపై 'పొగమంచు' ఎఫెక్ట్‌ ..

- December 28, 2016 , by Maagulf
2000 మంది విమాన ప్రయాణీకులపై 'పొగమంచు' ఎఫెక్ట్‌ ..

 బహ్రెయిన్‌ ఇంటర్నేషనల్‌ ఎయిర్‌పోర్ట్‌ రన్‌వే ఆకస్మిక మూసివేత కారణంగా 2000 మంది ప్రయాణీకులు ఇబ్బంది పడ్డారు. భారీగా కమ్ముకున్న పొగమంచు కారణంగా రన్‌వేని మూసివేయాల్సి వచ్చింది. బహ్రెయిన్‌ ఎయిర్‌పోర్ట్‌ కంపెనీ ఈ మేరకు ఓ ప్రకటన చేసింది. లో విజిబిలిటీ కారణంగా బహ్రెయిన్‌ ఇంటర్నేషనల్‌ ఎయిర్‌పోర్ట్‌ 21:20 (26 డిసెంబర్‌) నుంచి 04.30 (27 డిసెంబర్‌) గంటల వరకు విమాన రాకపోకల్ని నిలిపివేశామనీ, కొన్నిటిని ఇతర ఎయిర్‌పోర్టులకు మళ్ళించామని బహ్రెయిన్‌ ఎయిర్‌పోర్ట్‌ కంపెనీ ఓ ప్రకటనలో పేర్కొంది. ఈ కారణంగా 2000 మంది ప్రయాణీకులపై ప్రభావం పడినట్లు అధికారులు పేర్కొన్నారు. 5 గంటల తర్వాత విమాన రాకపోకలు యదాథంగా కొనసాగాయనీ, ప్రయాణీకులు తమ విమానాల రీషెడ్యూల్‌పై సంబంధిత ఎయిర్‌లైన్స్‌తో టచ్‌లో ఉండాలని అధికారులు విజ్ఞప్తి చేశారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com