విమానాశ్రయంలో ఉద్యోగులకు ఎంట్రీపాస్తోపాటు ఆధార్ తప్పనిసరి..
- December 28, 2016
దేశరాజధాని నగరమైన న్యూఢిల్లీలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో పనిచేస్తున్న ఉద్యోగులు జనవరి 1వతేదీనుంచి ఎంట్రీ పాస్తోపాటు ఆధార్ కార్డును వెంట తీసుకురావాలని సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్సు ఆదేశించింది. విమానాశ్రయంలో భద్రతను మరింత పెంచేందుకు ఈ చర్య తీసుకున్నట్లు విమానాశ్రయ భద్రతాధికారులు చెప్పారు. ఢిల్లీ విమానాశ్రయంలో ఉద్యోగులు ఎంట్రీ పాస్ తోపాటు ఆధార్ కార్డును తప్పకుండా చూపించాలని సీఐఎస్ఎఫ్ డీజీ ఓపీ సింగ్ చెప్పారు. గతంలో తాము ఇచ్చిన కలర్ కోడ్ పాస్ స్థానంలో అల్ఫాబెటికల్ కోడ్ తో పాసులు జారీచేయాలని, దీంతోపాటు ఉద్యోగుల ఫోటోల సైజు పెంచాలని నిర్ణయించామన్నారు.
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







