మాజీ అధ్యక్షురాలికి అవినీతి ఉచ్చు!
- December 28, 2016
అర్జెంటీనా మాజీ అధ్యక్షురాలు క్రిస్టినా ఫెర్నాండేజ్ను అవినీతి ఉచ్చు వెంటాడుతోంది. ప్రజా పనుల విషయంలో ఆమె అడ్డంగా అవినీతికి పాల్పడ్డట్టు వచ్చిన అభియోగాలను ఫెడరల్ జడ్జి జులియన్ ఎర్కొలిని విచారణకు స్వీకరించారు. క్రిస్టినాతోపాటు ఆమె ప్రభుత్వంలో ప్రణాళిక మంత్రిగా పనిచేసిన జులియో డేవిడో, ప్రజాపనుల కార్యదర్శి జోస్ లోపెజ్లపై అవినీతి కేసులను కోర్టు విచారణకు స్వీకరించింది.
ఈ అవినీతి వల్ల లబ్ధిపొందిన వ్యాపారవేత్త లాజారో బేజ్ను కూడా ఈ కేసులో నిందితుడిగా చేర్చింది. 633 మిలియన్ డాలర్ల చొప్పున నిందితుల ఆస్తులను జప్తు చేయాలని కోర్టు ఆదేశించింది. అయితే, అంతమొత్తంలో ఆస్తులు నిందితుల వద్ద ఉన్నాయా?
అన్నది తెలియరాలేదు. 2003 మార్చ్ నుంచి 2015 డిసెంబర్ మధ్యకాలంలో ఈ అవినీతి, అక్రమాలు జరిగినట్టు అధికార పత్రిక పేర్కొన్నది.
తాజా వార్తలు
- కువైట్లో భారీ డ్రగ్స్ వ్యతిరేక ఆపరేషన్.. ఎనిమిది మంది అరెస్ట్..!!
- ఆగస్టు నుంచి పీహెచ్సీసీ 'కేర్ సమ్మర్' కార్యక్రమం..!!
- ఇంధన రంగంలో సహకారంపై సౌదీ–భారత్ చర్చలు..!!
- సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టులు.. వ్యక్తి అరెస్ట్..!!
- ఒమన్లో జూలై 25 నుంచి 'పర్పుల్ శనివారం' ప్రారంభం..!!
- దుబాయ్లో 30 ఫుట్ ఓవర్ బ్రిడ్జీలపై స్మార్ట్ LED వ్యవస్థ..!!
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..







