భారత్‌కు లైన్‌క్లియర్!

- December 28, 2016 , by Maagulf
భారత్‌కు లైన్‌క్లియర్!

 డిసెంబర్ 28: అణు సరఫరా దేశాల కూటమి (ఎన్‌ఎస్‌జి)లో కొత్త సభ్యులను చేర్చుకోవడానికి రూపొందించిన ఓ ముసాయిదా ప్రతిపాదన ఆ కూటమిలో భారత్ ప్రవేశానికి మార్గాన్ని సుగమం చేస్తోందని, అయితే పాకిస్తాన్‌కు మాత్రం అవకాశం ఉండకపోవచ్చని అమెరికాకు చెందిన ఆయుధ నియంత్రణ సంస్థ ఒకటి అంటోంది. అయితే సభ్యత్వానికి సంబంధించిన నిబంధనలను సడలించడం వల్ల అణ్వస్త్ర వ్యాప్తి నిరోధక ఒప్పందం నీరుగారి పోతుందని కూడా ఆర్మ్స్ కంట్రోల్ అసోసియేషన్ (ఏసిఏ)హెచ్చరిస్తోంది. భారత్, పాకిస్తాన్‌లాంటి అణ్వస్త్ర వ్యాప్తి నిరోధక ఒప్పందం (ఎన్‌పిటి)పై సంతకాలు చేయని దేశాలు ఎలా ఎన్‌ఎస్‌జిలో చేరవచ్చో వివరిస్తూ ఎన్‌ఎస్‌జి మాజీ అధ్యక్షుడయిన రఫాయెల్ మారియానో గ్రోస్సీ రెండు పేజీల డాక్యుమెంట్‌ను రూపొందించినట్లు గత వారం అమెరికా మీడియాలో కథనాలు వచ్చాయి.
 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com