సెన్సార్‌ పనులు పూర్తిచేసుకున్న 'ఖైదీనంబర్‌ 150'

- December 29, 2016 , by Maagulf
సెన్సార్‌ పనులు పూర్తిచేసుకున్న 'ఖైదీనంబర్‌ 150'

మెగాస్టార్‌ చిరంజీవి కథానాయకుడిగా రూపొందుతున్న చిత్రం 'ఖైదీనంబర్‌ 150'. గురువారం ఈ సినిమా సెన్సార్‌ పూర్తి చేసుకుంది. చిత్రాన్ని వీక్షించిన సెన్సార్‌ సభ్యులు 'యు/ఏ' సర్టిఫికెట్‌ జారీ చేశారు. దాదాపు తొమ్మిదేళ్ల విరామం అనంతరం చిరంజీవి వెండితెరపై కన్పిస్తున్న చిత్రం కావడంతో అభిమానుల్లోనే కాదు ఇటు చిత్ర పరిశ్రమలోనూ ఆసక్తి నెలకొంది. ప్రముఖ దర్శకుడు వి.వి.వినాయక్‌ దర్శకత్వం వహిస్తుండగా, చిరు సరసన కాజల్‌ అగర్వాల్‌ కథానాయికగా నటిస్తోంది. కొణిదెల ప్రొడక్షన్‌ కంపెనీ పతాకంపై రాంచరణ్‌ నిర్మిస్తున్నారు. దేవిశ్రీప్రసాద్‌ సంగీతం సమకూర్చుతున్నారు. సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com